Don't Miss!
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Technology కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్లను విడుదల చేసిన జియో సినిమా... యాడ్ ఫ్రీ, 4K కంటెంట్ సహా అనేక ప్రయోజనాలు..!
- Lifestyle బీట్రూట్ జ్యూస్ తాగితే ఇన్ని ప్రయోజనాలా..? వారంపాటు తాగితే ఎలాంటి ఫలితముంటుందంటే..?
- News టీడీపీ గెలుపు కష్టమే.. ఎంపీ అభ్యర్థి అభ్యర్థి లావు కృష్ణ దేవరాయలు షాకింగ్ కామెంట్స్
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- Finance ITC: ఐటీసీ ఇన్వెస్టర్లకు శుభవార్త.. !
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ధ్వంసం చేసి ఏం సాధిస్తాం.. కాపాడుకొందాం, కదలిరండి.. పవన్, కౌశల్, అనసూయ పిలుపు
నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలకు ప్రభుత్వాలు తీసుకొంటున్న చర్యలపై తెలుగు రాష్ట్రాల్లో నిరసనలు ఊపందుకొంటున్నాయి. ప్రధానంగా సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్, కాంగ్రెస్ పార్టీ నేత వీహెచ్ ఇ్పటికే స్పందించారు. తాజాగా విజయ్ దేవరకొండ, రాహుల్ రామకృష్ణ, అనసూయ, బిగ్బాస్ విజేత కౌశల్ మండా స్పందించారు.
బంగారు తెలంగాణానా? కాలుష్య తెలంగాణనా?
భావి తరాలకి, బంగారు తెలంగాణ ఇస్తామా? యురేనియం కాలుష్యం తెలంగాణ ఇస్తామా? అన్నది అన్ని ప్రజా సంఘాలు , రాజకీయ పక్షాలు ఆలోచించాలి? అని పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు. భూమి మనుషుల సొత్తు కాదు అటూ అమెరికాలో ఆదివాసీలకు సంబంధించిన భూమి సమస్య గురించి యూఎస్ ప్రభుత్వం చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా ఉదహరించారు.
భూమిని తవ్వడం అంటే
అర్జున్ రెడ్డి చిత్రంతో విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకొన్న రాహుల్ రామకృష్ణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాడు. మైనింగ్ అనేది కేవలం భూమిని తవ్వడం అనుకొంటే పొరపాటే.. మైనింగ్ వల్ల అమూల్యమైన సహజ వనరులు, పర్యావరణం, అరుదైన జీవ సంపద నాశనం అవుతుంది. అలాగే వేలాది ఆదివాసీయులు నిరాశ్రయులవుతారు. వేల ఎకరాల అడవులు కాలగర్భంలో కలిసిపోతాయి అని రాహుల్ ఆందోళన వ్యక్తం చేశాయి.
మనల్ని మనమే ధ్వంసం
నల్లమలలో యురేనియం తవ్వకాలపై బిగ్బాస్ విజేత, నటుడు కౌశల్ మందా స్పందించాడు. నల్లమల అడవులను నాశనం చేస్తే మనం మనల్నే ధ్వంసం చేసుకొన్నవాళ్లమవుతాం. భావితరాలు స్వచ్ఛమైన వాయువులను పీల్చడానికి, పర్యావరణ ముప్పు రాకుండా ఉండటానికి నల్లమల్ల అడవులను కాపాడుకోవాలి అని కౌశల్ తెలిపారు.
పిటిషన్పై సంతకాలు
పర్యావరణానికి ముప్పు వాటిల్లే తవ్వకాలపై నిరసన తెలియజేయాల్సిన అవసరం ఉంది. అలాంటి ప్రయత్నాన్ని అడ్డుకునేందుకు రూపొందించిన పిటిషన్పై సంతకాలు చేయాలి. మనమంతా సంతకాలు చేసి నల్లమల అడవులను కాపాడుకొందాం అని అనసూయ ట్వీట్ చేశారు.
విజయ్ దేవరకొండ ఆందోళన
ఇప్పటికే మనం నదులను, చెరువులను కలుషితం చేసాం. తాగేందుకు నీరు దొరకని పరిస్థితి కి వచ్చాము. గాలి , నీరు కలుషితమవుతున్నాయి. కొన్ని నగరాలు నీళ్లు లేక అల్లాడుతున్నాయి. యురేనియం కొనుక్కోవచ్చు, అడవులను కొనగలమా..! అవసరం అయితే సోలార్ ఎనర్జీ ని వినియోగం లోకి తెద్దాం...ప్రతి పై కప్పు పై సోలార్ ప్లేట్స్ ని ఏర్పాటు చేసే చట్టాలు చేద్దాం.. స్వచ్ఛమైన గాలి, పరిశుభ్రమైన నీరు లేనప్పుడు ఎలక్ట్రిసిటీ తో ఏమి చేయాలి...? మిగిలిన కొద్దిపాటి వనరులను కూడా నాశనం చేసి ఏం సాధిస్తాం. నల్లమలను కాపాడుకుందాం... మనకోసం, మన భవిష్యత్ కోసం అంటూ విజయ్ దేవరకొండ ట్వీట్ చేశారు.