Don't Miss!
- Technology ధర రూ.17999 కే 108MP కెమెరా, 6000mAh బ్యాటరీ, 6.78 అంగుళాల డిస్ప్లే 5G స్మార్ట్ఫోన్..!!
- News గంటా Vs అవంతి, బిగ్ ఫైట్ - గురు శిష్యుల్లో గెలిచేదెవరు..!?
- Finance Insurance Company: ఈ శని, ఆదివారాలు తెరిచి ఉండనున్న బీమా కంపెనీలు..
- Lifestyle సమ్మర్ బ్లాక్ బస్టర్ రిసిపి మ్యాంగో చికెన్ కర్రీ..!ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది
- Sports తలతిక్క నిర్ణయాలు: ఆ టీమ్కు అసలు సెన్స్ ఉందా: మాజీ లెజెండ్ ఫైర్
- Automobiles ముంబయి- అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ కోసం ‘బాలస్ట్లెస్' ట్రాక్.. దీని ప్రత్యేకతలు తెలుసా.??
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
రైల్వే స్టేషన్ లో పవన్ కళ్యాణ్ రచ్చ
హైదరాబాద్ : పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో రిలయన్స్ ఎంటర్ టైన్మెంట్స్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా ప్రై.లి పతాకంపై ఓ చిత్రం నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం నిమిత్తం రైల్వే స్టేషన్ సెట్లో పవన్ కళ్యాణ్ ఆర్ ఎఫ్ సి లో షూటింగ్ లో పాల్గొంటున్నారు. చిత్రంలో వచ్చే ఈ సీన్స్ చాలా కీలకమైనవి అని... పవన్ అభిమానులు విజిల్స్ వేసే రీతిలో సీన్స్ ఉంటాయని తెలుస్తోంది.
ఇక బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నఈ భారీ చిత్రం షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. ఈ చిత్రాన్ని ఆగస్టు 7వ తేదీన విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ మాట్లాడుతూ...'మా బేనర్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ నాన్ స్టాప్గా జరుగుతోంది. పవన్ కళ్యాణ్ స్టైల్ లో ఉంటూనే త్రివిక్రమ్ మార్క్తో ఎంతో వైవిద్యంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం చక్కని ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా అందరినీ అలరిస్తుంది. ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ ను త్వరలోనే ప్రకటిస్తాము. వరల్డ్ వైడ్ గా ఈ చిత్రాన్ని ఆగస్ట్ 7న రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నాము' అన్నారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన సమంత హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో 40 మంది ప్రముఖ తారాగణం మిగతా పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం : దేవిశ్రీ ప్రసాద్, ఫోటోగ్రఫీ : ప్రసాద్ మూరెళ్ల, ఫైట్స్ : రామ్ లక్ష్మన్, ఆర్ట్ : రవీందర్, కో-ప్రొడ్యూసర్స్ : భోగవల్లి బాపినీడు, రిలయన్స్ ఎంటర్ టైన్మెంట్, నిర్మాత : బివిఎస్ఎన్ ప్రసాద్, రచన-దర్శకత్వం : త్రివిక్రమ్ శ్రీనివాస్.