Don't Miss!
- News SRH Vs RCB మ్యాచ్: ఉప్పల్ మార్గంలో అర్ధరాత్రి వరకు మెట్రో, ఆర్టీసీ సేవలు
- Sports DC vs GT: అందుకే డేవిడ్ వార్నర్ను పక్కన పెట్టాం: రిషభ్ పంత్
- Lifestyle ఈ బ్లడ్ గ్రూప్ దొరకడం చాలా కష్టం..కొంటే ధర ఎంతో తెలుసా..?
- Automobiles మరో సమస్యలో చిక్కుకున్న శిల్పా శెట్టి భర్త.. ఆ లగ్జరీ కార్లు సీజ్
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
త్రివిక్రమ్, పవన్ చిత్రం షెడ్యూల్ డిటేల్స్
హైదరాబాద్ : పవన్కల్యాణ్ హీరోగా శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా ప్రై.లి.సంస్థ ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది. త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ఈ నెల 22 నుంచి హైదరాబాద్లో మొదలవుతుంది. ఇందుకోసం ప్రత్యేకంగా సెట్ని తీర్చిదిద్దారు. స్పెయిన్లో కొంత మేరకు చిత్రీకరణ చేస్తారు.
అలాగే ఈ చిత్రంలో సెకండ్ హీరోయిన్ గా ప్రణీతను ఎంపిక చేసారు. 'బావ' సినిమాలో అల్లరి మరదలుగా కవ్వించింది... ప్రణీత. ఇప్పుడు పవన్ కల్యాణ్తో నటించే అవకాశం అందుకొంది. ఈ చిత్రానికి బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాత. ఈ చిత్రంలో సమంత హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ స్వరకర్త. సహ నిర్మాతలు: భోగవల్లి బాపినీడు, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్
పవన్-త్రివిక్రమ్ మూవీ ఓపెనింగ్ ఫంక్షన్ నవంబర్ 23 ఫిల్మ్ నగర్లో జరిగింది. ఫిల్మ్ నగర్ శ్రీవెంకటేశ్వర స్వామి దేవాలయంలో పూజా ఫార్మాలిటీస్ పూర్తి చేసారు. భారీ నిర్మాత బివిఎస్ ఎన్ ప్రసాద్ నిర్మాతగా, రిలియన్స్ ఎంటర్టైన్మెంట్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా ప్రెవేట్ లిమిటెడ్ పతాకంపై ఈ చిత్రం రూపొందుతుంది.
నిర్మాత బివిఎస్ ఎన్ ప్రసాద్ మాట్లాడుతూ... పవన్ కళ్యాణ్ గారితో సుస్వాగతం రోజుల్నించీ మంచి సినిమా చెయ్యాలన్న కోరిక ఉంది. అది ఇన్నాళ్లకు నెరవేరింది. పవన్, త్రివిక్రమ్ గార్ల కాంబినేషన్ లో ఇంత మంచి ప్రాజెక్టు చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది అన్నారు.చిత్రానికి సంగీతం దేవిశ్రీ ప్రసాద్, ఫొటోగ్రఫీ ప్రసాద్ మూరెళ్ల, ఫైట్స్ రామ్ లక్ష్మణ్, ఆర్ట్ రవీందర్, కో ప్రొడ్యూసర్స్ భోగవల్లి బాపినీడు, రిలియన్స్ ఎంటర్టైన్మెంట్స్
ఈ చిత్రానికి 'హరే రామ హరే కృష్ణ', 'సరదా' టైటిల్స్ పరిశీలిస్తున్నట్లు రూమర్లు వినిపిస్తున్నాయి. అయితే త్రివిక్రమ్ మాత్రం ఈచిత్రానికి ఇంకా టైటిల్ ఖరారు కాలేదని, నేను చెప్పే వరకు ఏ వార్తను నమ్మ వద్దని ఇటీవల ఓ ఇంట్వర్యూలో తేల్చి చెప్పారు. పవన్, త్రివిక్రమ్ కాంబినేషన్లో గతంలో జల్సా సినిమా వచ్చింది. జల్సా కలెక్షన్లను కురిపించింది. దీంతో త్రివిక్రమ్, పవన్ కాంబినేషన్కు సమంత తోడు కావడంతో ఈ ప్రాజెక్టుపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించనున్నారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించనున్నారు.