Don't Miss!
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ భారీ విరాళం.. ప్రధానికి కోటి.. తెలుగు రాష్ట్రాలకు..
కరోనా వ్యాధితో అతలాకుతలం అవుతున్న తెలుగు రాష్ట్రాలను ఆదుకోనేందుకు తెలుగు సినిమా ప్రముఖులు ఇప్పటికే ముందుకు వచ్చారు. తెలంగాణ, ఆంధ్రాలో పరిస్తితి మరింత జటిలం కావడంతో తమకు తోచిన విధంగా సహకారాన్ని అందిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు అండగా నిలుస్తున్నారు. ఈ క్రమంలోనే పవర్స్టార్, జనసేన అధినేత పవన్ కల్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ భారీ విరాళాలను ప్రకటించారు. వివారాల్లోకి వెళితే..
Recommended Video
ప్రధాని నిధికి కోటి రూపాయలు
కరోనావైరస్పై పోరాటం చేసేందుకు పలు చర్యలు తీసుకొంటున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అండగా నిలువాలని పవన్ కల్యాణ్ నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వానికి సహాయంగా జనసేన అధినేత ప్రధాన మంత్రి సహాయ నిధికి రూ.1 కోటి ప్రకటించారు. త్వరలోనే ప్రధానికి ఈ మొత్తాన్ని అందచేయనున్నారు.
తెలుగు రాష్ట్రాల సీఎంకు 50 లక్షలు
ఇక తెలుగు రాష్ట్రాల్లో కరోనా బాధితుల సహాయ చర్యల కోసం కూడా పవన్ కల్యాణ్ స్పందించారు. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు రూ.50 లక్షల విరాళం ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వానికి రూ.50 లక్షలు, ఏపీ ప్రభుత్వానికి రూ.50 లక్షలు ఇవ్వాలని నిర్ణయం తీసుకొన్నారు. ఈ మేరకు ఓ ప్రకటనను విడుదల చేశారు. త్వరలోనే సీఎం రిలీఫ్ ఫండ్ ఖాతాకు ఈ మొత్తాన్ని అందించనున్నారు.
త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆర్థిక సహాయం
ఇక మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా కరోనా బాధితుల సహాయార్థం విరాళం అందించారు. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు చెరో రూ.10 లక్షలు అందించాలని నిర్ణయం తీసుకొన్నారు. త్వరలోనే ఈ మొత్తాన్ని ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్కు, తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్కు అందించే ఏర్పాట్లు చేస్తున్నారు.
కదిలిన టాలీవుడ్
కరోనావైరస్ ప్రభావంతో తల్లడిల్లుతున్న పేదలకు, కళాకారులకు చేయూత నందించేందుకు టాలీవుడ్ సినీ ప్రముఖులు ముందుకు వస్తున్నారు. జీవితారాజశేఖర్ దంపతులు, శివాజీరాజా, అలాగే వీవీ వినాయక్ తదితరులు ఇప్పటికే ఏదో ఒక రూపంలో కళాకారులను ఆదుకొంటున్న సంగతి తెలిసిందే.