Don't Miss!
- Automobiles కేవలం రూ. 8,999లకే డ్యాష్క్యామ్.. ఈ BIS కెమెరా కార్లకు పెట్టుకుంటే చాలు!!
- News అక్కడ.. యుద్ధ వాతావరణం: భారీగా దాడులు
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ భారీ విరాళం.. ప్రధానికి కోటి.. తెలుగు రాష్ట్రాలకు..
కరోనా వ్యాధితో అతలాకుతలం అవుతున్న తెలుగు రాష్ట్రాలను ఆదుకోనేందుకు తెలుగు సినిమా ప్రముఖులు ఇప్పటికే ముందుకు వచ్చారు. తెలంగాణ, ఆంధ్రాలో పరిస్తితి మరింత జటిలం కావడంతో తమకు తోచిన విధంగా సహకారాన్ని అందిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు అండగా నిలుస్తున్నారు. ఈ క్రమంలోనే పవర్స్టార్, జనసేన అధినేత పవన్ కల్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ భారీ విరాళాలను ప్రకటించారు. వివారాల్లోకి వెళితే..
Recommended Video
ప్రధాని నిధికి కోటి రూపాయలు
కరోనావైరస్పై పోరాటం చేసేందుకు పలు చర్యలు తీసుకొంటున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అండగా నిలువాలని పవన్ కల్యాణ్ నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వానికి సహాయంగా జనసేన అధినేత ప్రధాన మంత్రి సహాయ నిధికి రూ.1 కోటి ప్రకటించారు. త్వరలోనే ప్రధానికి ఈ మొత్తాన్ని అందచేయనున్నారు.
తెలుగు రాష్ట్రాల సీఎంకు 50 లక్షలు
ఇక తెలుగు రాష్ట్రాల్లో కరోనా బాధితుల సహాయ చర్యల కోసం కూడా పవన్ కల్యాణ్ స్పందించారు. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు రూ.50 లక్షల విరాళం ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వానికి రూ.50 లక్షలు, ఏపీ ప్రభుత్వానికి రూ.50 లక్షలు ఇవ్వాలని నిర్ణయం తీసుకొన్నారు. ఈ మేరకు ఓ ప్రకటనను విడుదల చేశారు. త్వరలోనే సీఎం రిలీఫ్ ఫండ్ ఖాతాకు ఈ మొత్తాన్ని అందించనున్నారు.
త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆర్థిక సహాయం
ఇక మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా కరోనా బాధితుల సహాయార్థం విరాళం అందించారు. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు చెరో రూ.10 లక్షలు అందించాలని నిర్ణయం తీసుకొన్నారు. త్వరలోనే ఈ మొత్తాన్ని ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్కు, తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్కు అందించే ఏర్పాట్లు చేస్తున్నారు.
కదిలిన టాలీవుడ్
కరోనావైరస్ ప్రభావంతో తల్లడిల్లుతున్న పేదలకు, కళాకారులకు చేయూత నందించేందుకు టాలీవుడ్ సినీ ప్రముఖులు ముందుకు వస్తున్నారు. జీవితారాజశేఖర్ దంపతులు, శివాజీరాజా, అలాగే వీవీ వినాయక్ తదితరులు ఇప్పటికే ఏదో ఒక రూపంలో కళాకారులను ఆదుకొంటున్న సంగతి తెలిసిందే.