Don't Miss!
- News ముగిసిన నామినేషన్ల పర్వం: బండి సంజయ్ సహా చివరి రోజు నామినేషన్లు వేసింది వీరే
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
మీ సీఎం సాబ్కు ఈ వకీల్ సాబ్ హెచ్చరికగా చెప్పండి.. డైలాగ్ తో అదరగొట్టిన పవన్ కళ్యాణ్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలు చేస్తున్నప్పటికీ మరోవైపు రెగ్యులర్ రాజకీయాల్లో కూడా బిజీగా ఉంటున్నారు. రైతుల సమస్యలపై ఎప్పటికప్పుడు అధికార పక్షాన్ని నిలదీసే ప్రయత్నం చేస్తున్నారు. చాలా వరకు పవన్ పొలిటికల్ ప్రసంగాలతో సినిమాలకు సంబంధించిన విషయాలను పెద్దగా తీసుకురారు. సందర్భం వస్తే తప్ప తన సినిమాల పేర్లు కూడా తియ్యరు. ఇక ఇటీవల మచిలీపట్నంలో జరిగిన పబ్లిక్ మీటింగ్ లో మాత్రం పవర్ స్టార్ వకీల్ సాబ్ హెచ్చరిక అంటే పవర్ఫుల్ కామెంట్స్ చేశారు.
త్వరలో వకీల్ సాబ్ రిలీజ్ పై క్లారిటీ..
పవన్ కళ్యాణ్ నెక్స్ట్ వకీల్ సాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. దిల్ రాజు నిర్మాణంలో వేణు శ్రీరామ్ నిర్మిస్తున్న ఆ సినిమా బాలీవుడ్ పింక్ మూవీకి రీమేక్ గా వస్తున్న విషయం తెలిసిందే. దాదాపు సినిమా పనులన్నీ పూర్తయ్యాయి. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కాస్త మిగిలి ఉంది. ఇక వీలైనంత త్వరగా రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇవ్వాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసుకుంటోంది.
ఇది వకీల్ సాబ్ హెచ్చరిక అని చెప్పండి
ఇక ఇటీవల మచిలీపట్నం మీటింగ్ లో జనసేన అధినేతగా స్పీచ్ ను మొదలు పెట్టిన పవన్ కళ్యాణ్ సడన్ గా స్పీచ్ మధ్యలో వకీల్ సాబ్ ను గుర్తు చేసుకుంటూ మీ సీఎం సాబ్ కు వకీల్ సాబ్ హెచ్చరిక జారీ చేశానని చెప్పండి అంటూ పవర్ఫుల్ గా మాట్లాడేశారు. దీంతో ఆ డైలాగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
|
రైతల సమస్యల కోసం వకీల్ సాబ్
ప్రస్తుతం జనసేన పార్టీ రైతులకు మద్దతుగా అధికార పక్షంపై పోరాటం చేయడానికి ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా పవన్ కళ్యాణ్ మచిలీపట్నంలో పబ్లిక్ మీటింగ్ నిర్వహించారు. ఆ పార్టీలో ఎంతో మంది నానిలు ఉన్నారు. అందులో ఒక నానికి నేను చెబుతున్నాను మీ సీఎం సాబ్ కి ఈ వకీల్ సాబ్ హెచ్చరికగా చెప్పండి.. అంటూ రైతుల సమస్యలపై మాట్లాడారు.
Recommended Video
జనసైనికులతో కలిసి అస్సెంబ్లీ ముట్టడి..
వచ్చే శాసన సభ సమావేశాల్లోగా నష్టపోయిన రైతులకి రూ.35 వేల పరిహారం అందించి తీరాల్సిందే. లేకుండా స్వయంగా జనసైనికులతో కలిసి అస్సెంబ్లీ ముట్టడికి పిలుపునిస్తాం.. అంటూ పవన్ కళ్యాణ్ సీరియస్ గా మాట్లాడారు. పవన్ పొలిటికల్ స్పీచ్ లలో మొదటిసారి వకీల్ సాబ్ పేరు తేవడంతో అది కూడా వైరల్ గా మారింది. మరి రానున్న రోజుల్లో పవన్ ఇంకెలాంటి డైలాగ్స్ తో తన బలాన్ని చూపిస్తారో చూడాలి.