Don't Miss!
- News Money astrology March 29th: ఈ రాశులవారికి ధనలక్ష్మీ కటాక్షం!!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
స్టైలిష్ డైరెక్టర్ విష్ణు దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్...
ప్రస్తుతం రెండు చిత్రాలు ఏకబిగిన చేస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరో చిత్రాన్ని అంగీకరించారు. పవన్ కళ్యాణ్ కధానాయకునిగా ఓ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందనుంది. తమిళంలో స్టయిలిష్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న విష్ణువర్ధన్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. 'వేదం', 'మర్యాదరామన్న' చిత్రాలు నిర్మించిన ఆర్కా మీడియా వర్క్స్ సమర్పణలో సంఘమిత్ర ఆర్ట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై నీలిమా నగేష్, సోభు యార్లగడ్డ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. 2011 జనవరి నెలాఖరున చిత్రీకరణ మొదలుకానుంది. యువన్ శంకర్ రాజా సంగీతం అందించబోతున్నారు. 'గమ్యం', 'వేదం' చిత్రాల దర్శకుడు క్రిష్ ఈ చిత్రానికి సంభాషణలు సమకూర్చనుండటం విశేషం.
ఈ సందర్భంగా నిర్మాతలు నీలిమా నగేష్, సోభు యార్లగడ్డ మాట్లాడుతూ 'ఇందులో పవన్ కళ్యాణ్ లుక్ చాల విభిన్నంగా అవుంతుంది. సినిమా ఓ పక్క స్టయిలిష్ గానే ఉంటేనే, మరో పక్క అభిమానులు కోరుకునే అన్ని అంశాలతో సంపూర్ణంగా రూపొందుతుంది. ఇందులో ఇద్దరు కధానాయికలు వుంటారు. ప్రస్తుతం వారి ఎంపిక జరుగుతోంది' అని తెలిపారు.