మరికొద్దిరోజుల్లో ‘మగధీర’, ‘సింహా’ లెక్కలు ‘పులి’ తో తారుమారు...
పవన్ కళ్యాణ్ చిత్రం హిట్ అయినా సంచలనమే..ఫ్లాప్ అయినా సంచలనమే అయితే నిర్మాతలు మాత్రం రెండు సందర్భాలలో సేఫ్ గా ఉంటారన్నది..ఇండస్ట్రీలో ఏ ఒక్కర్ని అడిగినా చెప్తారు..ఇండస్ట్రీలో మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ చిత్రాలకీ నిర్మాతలు లాస్ అయ్యారని(జానీ మినహా) ఇంతవరకు వార్తలు రాలేదు..అయితే మగధీర చిత్రం తర్వాత హీరోలు కూడా ఓ స్టామినా చిత్రం కోసం తహాతహా లాడుతున్నారనే విషయం తెలిసిందే..
ఇప్పుడు పవన్ కళ్యాణ్ నటించిన కొమరం పులి చిత్రం నిజమైన సంచలనం చేస్తుంది..ఒక్క ఆడియోతోనే పులి తన పంజా విసురుతుందంటే..చిత్రం గ్యారంటీగా 'మగధీర" ను క్రాస్ చేస్తుందనే..అభిప్రాయాలు..అటు పరిశ్రమకు చెందిన వారు..ఇటు ప్రేక్షకులు వ్యక్తపరుస్తున్నారు. వారి అంచనాలకు అనుగుణంగానే ఝ'పులి" పాటల క్యాసెట్, సిడిటు రికార్డు స్థాయిలో అమ్ముడు పోవడం..అలాగే ఒక్క ఏరియా అని కాకుండా అన్ని ఏరియాల్లో రికార్డు స్థాయిలో చిత్రం సేల్ అవ్వడం చూస్తుంటే ..'మగధీర" లెక్కలు మరి కొద్దిరోజుల్లోనే తారుమారు అయ్యే అవకాశం ఉందని విమర్వకులు స్ఫష్టం చేస్తున్నారు. అయితే ప్రస్తుతం మగధీర రికార్డును రీచ్ అవ్వడానికి 'సింహా" అన్ని సెంటర్స్ లో పరుగులు తీస్తున్న విషయం తెలిసిందే.
ఈ చిత్రం లో సాంగ్..'నీ వెంటే లోకం" అన్నట్లుగా పవన్ రికార్డులు సష్టించినా. ఆడియో ఫంక్షన్ లో పవన్ చెప్పినట్లుగా..దీనిని మించిన చిత్రం మరోకటి వస్తుందనే విషయం గుర్తుంచుకుని పవన్ అభిమానులు సెలబ్రేట్ చేసుకుంటే బాగుంటుంది..అని సూచిస్తున్నారు..సినీ విమర్శకులు...


Click it and Unblock the Notifications











