Don't Miss!
- Sports DC vs SRH: అందుకే ఉనాద్కత్ను పక్కనపెట్టాం: ప్యాట్ కమిన్స్
- News ఏపీలో కేజీఎఫ్ 3 గురించి చెప్పిన చంద్రబాబు
- Lifestyle మీ భార్యతో ఇలా ఎప్పుడైనా ఉన్నారా..? ఆ విషయంలో భర్త తగ్గాల్సిందే..!
- Finance HDFC Bank: అంచనాకు అనుగుణంగానే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫలితాలు..!
- Automobiles త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- Technology ధర రూ.1099 కే నావిగేషన్ ఫీచర్ తో boAt స్మార్ట్ వాచ్! సేల్, ఫీచర్ల వివరాలు
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
'పులి'పంజా అప్పుడే...
పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కొమురం పులి సినిమా రిలీజ్ ఆగస్టుకు వెళ్ళింది. మొదట ఎలక్షన్స్ కు ముందే విడుదల చేద్దామనుకున్నా పవన్ యువరాజ్యం అధ్యక్ష్యుడుగా రోడ్ షోలు నిర్వహిస్తూ బిజీగా ఉండటంతో అది సాధ్యం కాలేదు. అందులోనూ చిత్రం ఇప్పటివరకూ దాదాపు డెబ్బై శాతం మాత్రమే పూర్తయింది. మరో ప్రక్క ఎడిటింగ్ కార్యక్రమాలు సైతం సైమన్టైనస్ గా చేస్తున్నా షూటింగ్ ఫినిష్ కాకపోవటంతో ఈ నిర్ణయం తీసుకోకతప్పలేదంటున్నారు యూనిట్ వర్గాలు. ఇక ఖుషి చిత్రం కాంబినేషన్ రిపీట్ అవుతున్న చిత్రం కావటంతో దీనిపై పరిశ్రమలోనే కాక బయిట కూడా భారీ అంచనాలు ఉన్నాయి. వీటికి తోడు పవన్ తొలిసారిగా ద్విపాత్రాభినయం చేయటం, ఎ.ఆర్.రహ్మాన్ సంగతం మరింత క్యూరియాసిటీని లేపుతున్నాయి.
ఈ చిత్రం తదుపరి షెడ్యూల్ ఏప్రిల్ నెలాఖరు నుంచి మొదలవుతుందని యూనిట్ వర్గాల సమాచారం. ఏప్రిల్ 16, 23 తేదీల్లో రెండు విడతలుగా జరిగే ఎన్నికల పోలింగ్ అనంతరం పవన్ తిరిగి షూటింగ్ లో పాల్గొంటారనీ వారు అంటున్నారు. పవన్ డేట్స్ సర్దుబాటుని బట్టి బ్యాలన్స్ షూటింగ్ షెడ్యూల్స్ ప్లాన్ చేసి, ఆగస్టులో సినిమాను ప్రేక్షకుల ముందుకు తేవాలనేది దర్శకనిర్మాతల ఆలోచన. అలాగే ఈ చిత్రంలో పవన్ కు జోడిగా నిక్కిషా పటేల్ (తొలి పరిచయం), ప్రతినాయక పాత్రలో మనోజ్ బాజ్ పేయి, చరణ్ రాజ్, మిగతా పాత్రల్లో శరణ్య, నాజర్, ఆలీ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. బాలీవుడ్ కెమెరామెన్ బినోద్ ప్రదాన్ సినిమాటోగ్రఫీ, విజయన్ ఫైట్స్ అందిస్తున్నారు. పవన్ కెరీర్ లో ఇది ఓ సంచలన చిత్రం అవుతుందని అంతా భావిస్తున్నారు.