Don't Miss!
- News UN On Arvind Kejriwal: కేజ్రివాల్ అరెస్టుపై స్పందించిన ఐరాస-భారత్ కు కీలక సూచన..!
- Sports ఖమ్మం క్లాసెన్..మెదక్ మార్క్రమ్: క్రియేటివిటీ కొట్టేవాడే లేడు భయ్యా
- Lifestyle Lok Sabha Election 2024:మరో 3 నెలల్లో పట్టాభిషేకం ఎవరికి? జ్యోతిష్యం ఏ పార్టీకి స్ట్రాంగ్ గా సపోర్ట్ చేస్తోంది
- Automobiles కూతురిపై ప్రేమ - కోట్ల రూపాయల కారు గిఫ్ట్ ఇచ్చిన తండ్రి వీడియో
- Finance Essential Medicines: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న అవసరమైన ఔషధాల ధరలు..
- Technology రూ.12వేల కంటే తక్కువ ధరకే స్మార్ట్ఫోన్.. సెగ్మెంట్లో తొలిసారిగా 45W ఫాస్ట్ ఛార్జింగ్, డ్యూయల్ స్పీకర్లు..!
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
పూరికి ఆశా భంగం...‘రాంబాబు’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్(అఫీషియల్)
హైదరాబాద్ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'కెమెరామెన్ గంగతో రాంబాబు' చిత్రం బాక్సాఫీసు వద్ద పవర్ స్టార్ స్టామినా చూపుతూ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. అయితే పవన్ గత చిత్రం 'గబ్బర్ సింగ్' రికార్డులను మాత్రం ఈ చిత్రం బద్దలు కొట్టేలేక పోయింది. దీంతో గబ్బర్ సింగ్ను క్రాస్ చేస్తాం అన్న దర్శకుడు పూరి జగన్నాథ్ కు ఆశా భంగం కలిగినట్లయింది.
కలెక్షన్లపై అఫీషియల్ గా అందిన వివరాల ప్రకారం....ఆంధ్రప్రదేశ్ లో 'కెమెరామెన్ గంగతో రాంబాబు' చిత్రం తొలి వారం రూ. 21.74 కోట్ల షేర్ సాధించింది. పొలిటికల్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈచిత్రం కర్నాటకలో రూ. 3.19 కోట్లు, ఇతర రాష్ట్రాల్లో రూ. 1.3 కోట్లు వసూలు చేసింది. టోటల్ గా ఈ చిత్రం ఆలిండియా బాక్సాఫీసు వద్ద మొదటి వారం రూ. 26. 23 కోట్లు వసూలు చేసింది.
అక్టోబర్ 17న అమెరికాలో విడుదలైన ఈ చిత్రం అక్కడ మంచి బిజినెస్ చేసింది. పవన్, తమన్నా హీరో హీరోయిన్లుగా నటించిన ఈచిత్రం యూఎస్లో తొలి వారం 4 కోట్లు రాబట్టింది. ఈ మొత్తం గబ్బర్ సింగ్ తో పోల్చుకుంటే తక్కువే. గబ్బర్ సింగ్ చిత్రం తొలి వారం అమెరికాలో రూ. 4.13 కోట్లు వసూలు చేసింది.
ఓవరాల్గా ఈ చిత్రం వరల్డ్ వైడ్ ఫస్ట్ వీక్...రూ. 30.23 కోట్లు వసూలు చేసింది. సినిమా విడుదల కాక ముందు ఈచిత్ర దర్శకుడు పూరి జగన్నాథ్, నిర్మాత దానయ్య 'గబ్బర్ సింగ్' రికార్డులను బద్దలు కొడతాం అంటూ ప్రకటించుకున్నారు. కానీ తొలి వారం వసూళ్లు చేస్తే వాళ్ల ఆశ నెరవేరినట్లు కనిపించడం లేదు. ఎందుకంటే హరీష్ శంకర్ దర్శకత్వంలో గణేష్ నిర్మాతగా వచ్చిన 'గబ్బర్ సింగ్' చిత్రం తొలి వారం రూ. 36.5 కోట్లు రాబట్టింది. గబ్బర్ సింగ్ రేంజిలో ఈ చిత్రానికి హిట్ టాక్ రాక పోవడం, తెలంగాణ వివాదం ఈ పరిస్థికి కారణం అయి ఉండొచ్చనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.