Don't Miss!
- Sports ముక్కలవుతున్న ముంబై.. హార్దిక్ను విమర్శిస్తూ నబీ పోస్ట్
- News జగన్ పై దాడి ఘటనలో మరో టర్నింగ్ ! వడ్డెర సంఘాల ఎంట్రీ..
- Lifestyle ఎండాకాలంలో ఈ ఫుడ్స్కు దూరంగా ఉండాలి.. లేదంటే డీహైడ్రేషన్ తప్పదు..
- Technology ధర రూ.1799 కే, Youtube ,UPI ఫీచర్లతో Itel కొత్త ఫీచర్ ఫోన్! సేల్ వివరాలు
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
పూరికి ఆశా భంగం...‘రాంబాబు’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్(అఫీషియల్)
హైదరాబాద్ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'కెమెరామెన్ గంగతో రాంబాబు' చిత్రం బాక్సాఫీసు వద్ద పవర్ స్టార్ స్టామినా చూపుతూ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. అయితే పవన్ గత చిత్రం 'గబ్బర్ సింగ్' రికార్డులను మాత్రం ఈ చిత్రం బద్దలు కొట్టేలేక పోయింది. దీంతో గబ్బర్ సింగ్ను క్రాస్ చేస్తాం అన్న దర్శకుడు పూరి జగన్నాథ్ కు ఆశా భంగం కలిగినట్లయింది.
కలెక్షన్లపై అఫీషియల్ గా అందిన వివరాల ప్రకారం....ఆంధ్రప్రదేశ్ లో 'కెమెరామెన్ గంగతో రాంబాబు' చిత్రం తొలి వారం రూ. 21.74 కోట్ల షేర్ సాధించింది. పొలిటికల్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈచిత్రం కర్నాటకలో రూ. 3.19 కోట్లు, ఇతర రాష్ట్రాల్లో రూ. 1.3 కోట్లు వసూలు చేసింది. టోటల్ గా ఈ చిత్రం ఆలిండియా బాక్సాఫీసు వద్ద మొదటి వారం రూ. 26. 23 కోట్లు వసూలు చేసింది.
అక్టోబర్ 17న అమెరికాలో విడుదలైన ఈ చిత్రం అక్కడ మంచి బిజినెస్ చేసింది. పవన్, తమన్నా హీరో హీరోయిన్లుగా నటించిన ఈచిత్రం యూఎస్లో తొలి వారం 4 కోట్లు రాబట్టింది. ఈ మొత్తం గబ్బర్ సింగ్ తో పోల్చుకుంటే తక్కువే. గబ్బర్ సింగ్ చిత్రం తొలి వారం అమెరికాలో రూ. 4.13 కోట్లు వసూలు చేసింది.
ఓవరాల్గా ఈ చిత్రం వరల్డ్ వైడ్ ఫస్ట్ వీక్...రూ. 30.23 కోట్లు వసూలు చేసింది. సినిమా విడుదల కాక ముందు ఈచిత్ర దర్శకుడు పూరి జగన్నాథ్, నిర్మాత దానయ్య 'గబ్బర్ సింగ్' రికార్డులను బద్దలు కొడతాం అంటూ ప్రకటించుకున్నారు. కానీ తొలి వారం వసూళ్లు చేస్తే వాళ్ల ఆశ నెరవేరినట్లు కనిపించడం లేదు. ఎందుకంటే హరీష్ శంకర్ దర్శకత్వంలో గణేష్ నిర్మాతగా వచ్చిన 'గబ్బర్ సింగ్' చిత్రం తొలి వారం రూ. 36.5 కోట్లు రాబట్టింది. గబ్బర్ సింగ్ రేంజిలో ఈ చిత్రానికి హిట్ టాక్ రాక పోవడం, తెలంగాణ వివాదం ఈ పరిస్థికి కారణం అయి ఉండొచ్చనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.