Don't Miss!
- Automobiles నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- News ఈ అభిమానమే రఘురామ రాజుకు సీటు దూరం చేసింది..!!
- Technology X ప్లాట్ఫాం ప్రీమియం ఫీచర్లను ఉచితంగా వినియోగించుకోవచ్చు.. వారికి మాత్రమేనని ఎలాన్ మస్క్ ప్రకటన!!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Sports రసెల్కు భయపడి ఆ బౌలర్పై వేటు..KKRతో ఆడే RCB తుది జట్టు ఇదే!
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
పవన్ మాత్రమే కాదు త్రివిక్రమ్ కూడా కంప్లైంట్
హైదరాబాద్ : ఎవరూ ఊహించని విధంగా నాన్నకు ప్రేమతో నిర్మాతపై పవన్ కళ్యాణ్ కంప్లైంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ తొలిసారిగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా)ను సంప్రదించి ఫిర్యాదు చేసారు. ఇప్పుడు త్రివిక్రమ్ కూడా అదే నిర్మాతపై తన బకాయిల విషయమై కంప్లైంట్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఇదే నిర్మాతతో పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ గతంలో ‘అత్తారింటికి దారేది' చిత్రం చేసారు. ఈ సినిమా రెమ్యూనరేషన్ విషయంలో ఏర్పడ్డ వివాదమే ఇందుకు కారణమని తెలుస్తోంది. నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ తనకు ఇవ్వాల్సిన రెండు కోట్లు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని పవన్ కళ్యాణ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే ఎంత అనేది తెలియదు కానీ త్రివిక్రమ్ కూడా కంప్లైంట్ చేసారని అంటున్నారు.
ప్రముఖ నిర్మాత బి.వి.యస్.ఎన్ ప్రసాద్పై నటుడు పవన్ కల్యాణ్ ‘మా'కు ఫిర్యాదు చేశారు. ‘అత్తారింటికి దారేది' చిత్రం రెమ్యునరేషన్కు సంబంధించి తనకు ఇవ్వాల్సిన బకాయి చెల్లించలేదని పవన్ కల్యాణ్ ఫిర్యాదులో పేర్కొన్నారు.
‘అత్తారింటికి దారేది' చిత్రం రెమ్యునరేషన్లో కొంతభాగం మాత్రమే చెల్లించారని, మిగిలినది ‘నాన్నకు ప్రేమతో' చిత్రం విడుదల సమయంలో ఇస్తానని ప్రసాద్ తనకు తెలిపారని ఫిర్యాదులో పవన్ కల్యాణ్ పేర్కొన్నట్లు తెలుస్తోంది. అయితే బి.వి.యస్.ఎన్ ప్రసాద్ ప్రస్తుతం ఆ మిగిలిన బకాయి చెల్లించకపోవడంతో పవన్కల్యాణ్ ‘మా'ను ఆశ్రయించినట్లు సమాచారం.