Don't Miss!
- Sports SRH vs RCB: ఫుల్ టాస్కు ఔటైన మార్క్రమ్.. నవ్వు ఆపుకోలేకపోయిన కోహ్లీ!వీడియో
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- News కాలేజ్ అమ్మాయి ఇంటికి వెళ్లిన సీఎం, పోలింగ్ కు ఒక్కరోజు ముందు ప్రతిపక్షాలకు ఝలక్!
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
సైమాలోనూ 'గబ్బర్సింగ్' హంగామా
తాజాగా సైమా (సౌత్ ఇండియా ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్)-2013లోనూ సందడి చేస్తోంది. ఈ నెల 12, 13 తేదీల్లో షార్జాలోని ఎక్స్పో సెంటర్లో ఈ పురస్కారాల ప్రదాన వేడుక జరుగుతుంది. దక్షిణాది చిత్ర పరిశ్రమలన్నీ ఇందులో పాల్గొనబోతున్నాయి. పురస్కార విజేతలను ఆన్లైన్ ఓటింగ్ ద్వారా ఎంపిక చేస్తారు.
ఉత్తమ నటుడు, ఉత్తమ నటి విభాగాలతో పాటు మొత్తం 13 నామినేషన్లను 'గబ్బర్సింగ్' సినిమా సొంతం చేసుకొంది. తమిళ చిత్ర పరిశ్రమ తరఫున 'తుపాకీ' అత్యధికంగా 10 నామినేషన్లు దక్కించుకొంది. కన్నడ తరఫున 'ఆధురి', మలయాళ చిత్ర పరిశ్రమ తరఫున 'స్పిరిట్' చిత్రాలు తొమ్మిది చొప్పున నామినేషన్లు దక్కించుకొన్నాయి. తెలుగు చిత్ర పరిశ్రమలో 'గబ్బర్సింగ్'తో పాటు 'బిజినెస్మేన్', 'ఈగ', 'ఇష్క్', 'రచ్చ', 'ఢమరుకం' తదితర చిత్రాలు కూడా పలు విభాగాల్లో నామినేషన్లు సొంతం చేసుకొన్నాయి.
'గబ్బర్ సింగ్' చిత్రం బిగ్ స్క్రీన్పైనే కాదు... స్మాల్ స్క్రీన్పై కూడా సరికొత్త రికార్డులు సృష్టించింది. ఇటీవల ఈచిత్రం బుల్లితెరపై మగధీర రికార్డును బద్దలు కొట్టింది. నెం.1 హిట్ సినిమాగా రుజువు చేసుకుంది. పవన్ కళ్యాణ్కు ఎంత ఫాలోయింగ్ ఉందో నిరూపించింది. హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన 'గబ్బర్ సింగ్' చిత్రం టీఆర్పీ రేటింగ్స్ విషయంలో అత్యధిక పాయింట్లు సాధించడమే కాదు... గత రికార్డులను బద్దలు కొట్టేసింది. గతంలో బుల్లితెర టీఆర్పీ రేటింగ్ రికార్డు రాజమౌళి దర్వకత్వంలో రామ్ చరణ్ హీరోగా వచ్చిన 'మగధీర' చిత్రంపై ఉండేది. తాజాగా ఆ రికార్డును గబ్బర్ సింగ్ తిరగరాసాడు.
సంక్రాంతి సందర్భంగా టీవీల్లో ప్రసారం అయిన గబ్బర్ సింగ్ చిత్రానికి అత్యధికంగా 24 పాయింట్ల టీఆర్పీ రేటింగ్ సాధించి నెం.1 స్థానంలో నిలిచింది.. దీంతో మగధీర చిత్రం నెం.2 స్థానానికి వెళ్లి పోయింది. పవన్ కళ్యాణ్-శృతి హాసన్ జంటగా నటించిన ఈ చిత్రం సల్మాన్ ఖాన్ హీరోగా రూపొందిన బాలీవుడ్ దబాంగ్ కు రీమేక్. హరీష్ శంకర్ దర్శకత్వం వహించగా, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. పరమేశ్వర ఆర్ట్స్ బేనర్పై బండ్ల గణేష్ ఈచిత్రాన్ని నిర్మించారు.