Don't Miss!
- News న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్లో భూపాలపల్లి ఫొటోగ్రాఫర్ చిత్రం ప్రదర్శన
- Automobiles నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- Technology X ప్లాట్ఫాం ప్రీమియం ఫీచర్లను ఉచితంగా వినియోగించుకోవచ్చు.. వారికి మాత్రమేనని ఎలాన్ మస్క్ ప్రకటన!!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Sports రసెల్కు భయపడి ఆ బౌలర్పై వేటు..KKRతో ఆడే RCB తుది జట్టు ఇదే!
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
దాసరిని పరామర్శించిన పవన్, ఇన్ఫెక్షన్ సోకకూడదని ...
దాసరి నారాయణరావు అనారోగ్యానికి గురయ్యారన్న వార్త బాధ కలిగించిందని ప్రముఖ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపాడు.
హైదరాబాద్: తీవ్ర అనారోగ్యంతో సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దర్శకుడు దాసరి నారాయణరావును ప్రముఖ సినీ నటుడు పవన్ కల్యాణ్ పరామర్శించారు. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, నిర్మాత శరత్మరార్తో కలిసి ఆసుపత్రి వచ్చిన పవన్.. దాసరి ఆరోగ్యంపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం పవన్ మీడియాతో మాట్లాడుతూ.. ''దాసరికి బాగా లేదనగానే బాధ అనిపించింది. దాసరి ఆరోగ్యంపై వైద్యులు నమ్మకంగా ఉన్నారు. రేపు వెంటిలేటర్ తీసేస్తామని చెప్పారు'' అని వెల్లడించారు.
'మా' అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్, సినీ రచయితలు పరుచూరి బ్రదర్స్ కూడా ఆయనను పరామర్శించారు. అయితే ఇన్ఫెక్షన్ సోకకూడదని సందర్శనకు ఎవరినీ లోపలికి అనుమతించడం లేదని వారు వెల్లడించారు. అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నామని, ఆయన రెండు మూడు రోజుల్లో కోలుకుంటారని వైద్యులు చెప్పినట్టు వారు తెలిపారు.
150 కి ఫైగా చిత్రాలను తెరకెక్కిచిన దాసరి , ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో ఓ మూవీ ప్లాన్ చేస్తున్నాడు..దీంతో పాటు తమిళనాడు ముఖ్య మంత్రి జయలలిత జీవిత కథ ఆధారంగా ఓ చిత్రాన్ని తెరకెక్కించడానికి రెడీ అయ్యాడు.. ఈ లోపు దాసరి హాస్పటల్ లో జాయిన్ అవడం , ఇండస్ట్రీ ని షాక్ కు గురిచేసింది.
వార్త తెలుసుకున్న అభిమానులు భారీ ఎత్తున హాస్పటల్ కు చేరుకొని దాసరి ఆరోగ్యం గురించి ఆరా తీస్తున్నారు. సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దాసరిని మంచు మనోజ్, నటి జయసుధ, నిర్మాత అల్లు అరవింద్, దర్శకుడు రాఘవేంద్రరావు పరామర్శించారు. నిన్న దాసరి పరిస్థితి కాస్త ఆందోళనకరంగా ఉన్నప్పటికీ ప్రస్తుతం మెరుగ్గానే అల్లు అరవింద్ తెలిపారు.