twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మీడియాకు షాక్ ఇచ్చిన పవన్-త్రివిక్రమ్ మూవీ ఓపెనింగ్

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: సాధారణంగా ఏ సినిమా ఓపెనింగ్ అయినా హడావుడిగా, అందరికీ తెలిసేలా, మీడియాను ఆహ్వానించి మరీ చేస్తారు. అలాంటి దేమీ లేకుకండా మీడియా వారికి షాకిచ్చేలా చేసింది పవన్-త్రివిక్రమ్ మూవీ ఓపెనింగ్ ఫంక్షన్. ఈ చిత్రం ఓపెనింగ్ ఈ రోజు(నవంబర్ 23) ఫిల్మ్ నగర్లో ప్రారంభోత్సవం జరుపుకుంది.

    ఫిల్మ్ నగర్ శ్రీవెంకటేశ్వర స్వామి దేవాలయంలో పూజా ఫార్మాలిటీస్ పూర్తి చేసారు. ఈచిత్రానికి ఇంకా టైటిల్ ఖరారు కాక పోయినా 'సరదా' పేరుతో పిలుస్తున్నారు. త్వరలో టైటిల్ ఖరారు చేసే అవకాశం ఉంది. రెగ్యులర్ షూటింగు మాత్రం వచ్చే నెల నుంచి జరుగుతుందని తెలుస్తోంది. సమంత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన ఎంపికయింది.

    Pawan Kalyan

    పవన్, త్రివిక్రమ్ కాంబినేషన్లో గతంలో జల్సా సినిమా వచ్చింది. జల్సా కలెక్షన్లను కురిపించింది. దీంతో త్రివిక్రమ్, పవన్ కాంబినేషన్‌కు సమంత తోడు కావడంతో ఈ ప్రాజెక్టుపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించనున్నారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించనున్నారు.

    ఆ సంగతి పక్కన పెడితే... గబ్బర్ సింగ్ సీక్వెల్ వస్తుందని ప్రచారం జరుగుతుండటంపై హరీష్ శంకర్ స్పందించారు. 'నేను గానీ, నిర్మాత బండ్ల గణేష్ గానీ ఎప్పుడూ గబ్బర్ సింగ్-2 గురించి మాట్లాడుకోలేదు. ఏదైనా పవర్ స్టారే డిసైడ్ చేస్తారు' అంటూ ట్వీట్ చేసాడు.

    English summary
    Power star Pawan Kalyan-Trivikram srinivas movie has been formally launched today being produced by BSNV Prasad at Hyderabad. The movie muhurtham took place at 10.15am in Filmnagar Venkateswara Swamy temple and all the puja formalities were done.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X