Don't Miss!
- News మైండ్ బ్లాక్, డీసీఎం తమ్ముడి ఆస్తుల విలువ?, తల్లి, అన్న దగ్గర అప్పులు చేసిన సిట్టింగ్ ఎంపీ!
- Finance CRAMC IPO: త్వరలో కెనరా రోబెకో అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఐపీఓ..!
- Sports హేటర్స్ ఎంతకు తెగించారు: చివరికి హార్దిక్ పాండ్యా వైఫ్ను కూడా
- Technology 50MP సెల్ఫీ కెమెరా తో Samsung కొత్త ఫోన్! లాంచ్,ధర వివరాలు
- Automobiles ప్రపంచంలోనే 'ది బెస్ట్ కారు' ఇదే.. 29 దేశాల నుంచి 100 మంది ఆటో మొబైల్ జర్నలిస్ట్లు ఎంపిక చేసిన కారు ఏదంటే??
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
పవన్ కళ్యాణ్ మాట ఇచ్చాడు....
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా వేడుకలు, ఆడియో ఫంక్షన్లకు వీలైనంత దూరంగా ఉంటారు. తన ఫ్యామిలీ మెంబర్స్ సినిమా ఫంక్షన్లకే ఆయన వెళ్లరు. ఆ మధ్య తన అభిమాని నితిన్ పోరు పడలేక ఆ మధ్య ఓ సారి ఆడియో ఫంక్షన్ కు హాజరయ్యారంతే.
మాజీ ప్రధాని దేవెగౌడ మనవుడు, కర్నాటక మాజీ ముఖ్య మంత్రి కుమారస్వామి తనయుడు నిఖిల్ కుమార్ హీరోగా పరిచయం చేస్తూ రూ. 75 కోట్ల బడ్జెట్ తో 'జాగ్వార్' అనే తీసారు. ఈ చిత్రం ఆడియో వేడుకకు ముఖ్య అతిథిగా రావాలని కుమారస్వామి స్వయంగా వచ్చి పవన్ కళ్యాణ్ ను ఆహ్వానించారు.
పవన్ వస్తాడని ప్రచారం బాగానే జరిగింది. కానీ పవన్ కళ్యాణ్ రాలేదు. ఇటీవల మారిన కొన్ని పరిస్థితులతో ఆయన చాలా బిజీ అయ్యారు. ఈ విషయమై కుమారస్వామికి పవన్ కళ్యాణ్ ఫోన్ చేసినట్లు తెలుస్తోంది.
అనివార్య కారణాల వల్ల ఈ ఆడియో ఫంక్షన్కు రాలేకపోతున్నానని, ఈ సినిమా సక్సెస్ మీట్ జరిగితే తప్పక వస్తానని చెప్పాడట. దీనికి వెంటనే కుమారస్వామి బదులిస్తూ సినిమా విడుదలైన వారంలోపే విశాఖలో సక్సెస్మీట్ నిర్వహిస్తామని, దానికి తప్పకుండా రావాలని చెప్పారట కుమారస్వామి.