Don't Miss!
- News ఈ ఒక్కటి ఇంట్లో ఉంటే డబ్బు ఆటోమేటిక్ గా వస్తుంది
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
‘గుడ్ ఫ్రైడే’ గిఫ్టుగా పవనిజం సాంగుతో ‘రేయ్’
హైదరాబాద్: ‘రేయ్' సినిమా విడుదల ముందే ‘పవనిజం'సాంగు, ‘గోలీ మార్' సాంగు అంటూ హడావుడి చేసారు. ఈ రెండు సాంగులు ఉంటాయనరి ఆశపడి థియేటర్లకు వెళ్లిన అభిమానులకు కేవలం ‘గోలీమార్' సాంగ్ మాత్రమే కనిపించింది. దీంతో ఫ్యాన్స్ కాస్త డిస్సప్పాయింట్ అయ్యారనే చెప్పాలి.
అయితే అభిమానులను మళ్లీ మళ్లీ థియేటర్లకు రప్పించాలనే ప్లాన్ వేసిన దర్శక నిర్మాత వైవిఎస్ చౌదరి....రెండో వారం నుండి ‘పవనిజం' సాంగ్ సినిమాలో యాడ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అంటే ఏప్రిల్ 3( గుడ్ ఫ్రైడే) నుండి రేయ్ సినిమాలో ఈ పాటను ప్రదర్శించబోతున్నారు.
చిరంజీవి ‘గోలీమార్', పవనిజం సాంగ్ సినిమాలో వాడటంపై సాయి ధరమ్ తేజ్ స్పందిస్తూ....‘పెద్ద మావయ్య ఓసారి నాతో మాట్లాడుతూ...ప్రతి టెక్నీషియన్ని గౌరవించాలని చెప్పారు. మన రియల్ లైఫ్ క్యారెక్టర్ చాలా ముఖ్యమని చెప్పారు. దర్శకుడి హీరోగా ఉంటూనే నిర్మాతకు భారం కలిగించకుండా చూడాలి అని చెప్పారు. అందుకే ఆయన మాటలను ఎప్పటికప్పుడు గుర్తు చేసుకుంటూ ఉంటాను. సినిమాలో గోలిమార్ సాంగ్ చాలా బాగా వచ్చింది అన్నారు.
పవనిజం సాంగ్ సాంగ్ చాలా రోజుల క్రితమే కంపోజ్ చేసాము. ఓ రోజు నేను పవన్ మావయ్య ఈవిషయమై అడిగాను. ఆయన ఎప్పటిలాగే ఓ చిరు నవ్వు నవ్వి ఓకే చెప్పారు. ‘మీకు నిజంగా అవసరం అయితే చేయండి' అని సమాధానం ఇచ్చారు అని తెలిపారు.