Don't Miss!
- News అక్కడ.. యుద్ధ వాతావరణం: భారీగా దాడులు
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
పైలట్గా మారిన పాయల్ రాజ్పుత్.. పాకిస్థాన్ సరిహద్దుల్లో
Rx100 సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై అనతికాలంలోనే తనకంటూ సొంత ఫాలోయింగ్ ఏర్పర్చుకుంది పాయల్ రాజ్పుత్. పాత్ర పరిధి ఎంతనేది చూడకుండా వరుస అవకాశాలు అందిపుచ్చుకున్న ఈ భామ.. ఇటీవలే వెంకీ మామ రూపంలో సక్సెస్ ఖాతాలో వేసుకుంది. ఇక ప్రస్తుతం ఓ సినిమాలో డిఫెరెంట్ రోల్ పోషిస్తోంది పాయల్. జయంత్.సి.పరాన్జీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ''నరేంద్ర'' చిత్రంలో ఆమె పోషిస్తున్న రోల్ విలక్షణంగా ఉండనుందట.
ఈషాన్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై రూపొందుతున్న ఈ సినిమాలో ఇండియన్ ఫస్ట్ ఫిమేల్ ఫైటర్ పైలెట్గా పాయల్ రాజ్పుత్ నటిస్తోంది. ఆమె పాత్ర శక్తివంతంగా ఉంటుందని చిత్రబృందం పేర్కొంది. పాకిస్థాన్ జైలులో బందీ అయిన ఓ భారతీయ బాక్సర్ కథనే ఈ ''నరేంద్ర'' మూవీ. శత్రుదేశం నుంచి తప్పించుకున్న ఆ బాక్సర్ ఎలా మాతృభూమికి చేరుకున్నాడన్నదే ఈ చిత్ర ఇతివృత్తం. చిత్రంలో ట్విస్టులు గతంలో ఎన్నడూ చూడని విధంగా ఉంటాయని తెలుస్తోంది.
ఈ డిఫెరెంట్ చిత్రంలో నీలేష్ హీరోగా హీరోగా నటిస్తుండగా.. పాయల్ రాజ్పుత్, ఇజాబెల్లె లియేటి హీరోయిన్లుగా నటిస్తున్నారు. మానవహక్కుల కార్యకర్తగా ఇజాబెల్లె కనిపించనుంది. రామ్ సంపత్ బాణీలు కడుతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముగింపుకు చేరుకుంది. మిగిలిన పార్టీ కంప్లీట్ చేసి ఈ వేసవిలో సినిమాను ప్రేక్షకుల ముందుంచుతామని అంటున్నారు దర్శకనిర్మాతలు.