Don't Miss!
- News TTD: శ్రీవారి దర్శనం , సేవలు, వసతి గదుల కోటా విడుదల...!!
- Sports వరల్డ్ కప్కు దూబె ఎంపికైనట్లే.. కానీ ఓ సమస్య- డివిలియర్స్
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Automobiles త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
డి.సురేష్ బాబు 'పెళ్లిచూపులు' ప్రారంభం
హైదరాబాద్: విజయ్ దేవరకొండ, రీతు వర్మ హిరో హిరోయిన్ గా తెరకెక్కుతున్న చిత్రం 'పెళ్లిచూపులు' చిత్ర షూటింగ్ లాంఛనంగా ప్రారంభమైంది. దీనికి కొత్త దర్శకుడు తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నారు.
అన్నపూర్ణ స్టూడియోస్లో ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేశ్ క్లాప్ ఇవ్వగా.. నటుడు అశోక్ కుమార్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు... ఈ చిత్రాన్ని ధర్మపథ క్రియేషన్స్, బిగ్బెన్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
ఫేస్బుక్ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు
ఆదివారం హైదరాబాద్లో ప్రారంభమైందీ చిత్రం. ముహూర్తపు సన్నివేశానికి డి.సురేష్బాబు క్లాప్నిచ్చారు. అశోక్కుమార్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. శ్రీనివాస్ అవసరాల గౌరవ దర్శకత్వం వహించారు.
దర్శకుడు మాట్లాడుతూ ''సంప్రదాయ వాతావరణంలో సాగే ఆధునిక ప్రేమకథ ఇది. ఒక కొత్త రకమైన సినిమా చేద్దామని చెప్పగానే ఎక్కడా అడ్డు చెప్పకుండా కావల్సినంత స్వేచ్ఛ ఇచ్చారు నిర్మాతలు. విజయ్, రీతూకి మంచి పేరు తీసుకొచ్చే చిత్రమవుతుంది'' అన్నారు.
నిర్మాతల్లో ఒకరైన రాజ్ కందుకూరి మాట్లాడుతూ ''దర్శకుడు తరుణ్భాస్కర్ అనేక లఘు చిత్రాలు తీశాడు. ఆయన తయారు చేసిన ఈ కథలో కొత్తదనం ఉంది. 'ఉయ్యాల జంపాల', 'మనం'లా ఒక మంచి అనుభూతినిచ్చే సినిమా అవుతుంది. లైవ్ రికార్డింగ్తో చిత్రాన్ని రూపొందించే ప్రయత్నం చేస్తున్నామ''న్నారు.
చిన్న చిత్రాల ద్వారా చిత్ర పరిశ్రమకు కొత్త వారిని పరిచయం చేయడం ఆనందంగా ఉందని నిర్మాతలు పేర్కొన్నారు. 49 రోజుల షూటింగ్తో ఈ చిత్ర నిర్మాణాన్ని పూర్తి చేయనున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. చిత్రానికి ఛాయాగ్రహణం: నగేష్, సంగీతం: వివేక్ సాగర్