Don't Miss!
- News కోర్టు తీర్పుతో ఎన్నికల అస్త్రాన్ని కోల్పోయిన వైఎస్ షర్మిల, సునీత.. వాట్ నెక్స్ట్!!
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Sports IPL: ఆ కుర్రాడిపై అంబానీ కన్ను!
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
మహేష్ బాబు మూవీకి అనుమతి నిరాకరణ, షూటింగ్ అప్సెట్!
మహేష్ బాబు, కొరటాల మూవీ షూటింగ్ షెడ్యూల్ అప్ సెట్ అయింది. లక్నోలోని మూసాబాగ్ లో షూటింగుకు అనుమతి లభించలేదు.
'శ్రీమంతుడు' లాంటి భారీ విజయం తర్వాత మహేష్ బాబు, కొరటాల శివ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. 'భరత్ అను నేనే' అనే టైటిల్ తో తెరకెక్కబోతున్న ఈ సినిమాకు సంబంధించిన కొన్ని సన్నివేశాలు లక్నోలో చిత్రీకరించాలని ప్లాన్ చేయగా..... అనుమతి లభించలేదు.
లక్నోలోని చారిత్రక ప్రదేశం మూసాబాగ్ వద్ద సినిమా షూటింగ్ ప్లాన్ చేశారు. ఈ మేరకు అనుమతి కోసం స్థానిక అధికారులను సంప్రదించగా.... 'ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా' అధికారులు అనుమతి నిరాకరించారు.
ప్లాన్ అప్ సెట్
లక్నోలో దాదాపు నెల రోజుల పాటు షూటింగ్ జరుగాల్సి ఉంది. అయితే అనుకోకుండా అనుమతి నిరాకరణ ఎదురవ్వడంతో షూటింగ్ ప్లాన్, షెడ్యూల్ అంతా అప్ సెట్ అయింది.
Recommended Video
అనుమతి నిరాకరణకు కారణం
అనుమతి నిరాకరణకు కారణాలు చాలా ఉన్నాయి. అక్కడ ఏ వస్తువులను తాకొద్దని, చివరకు గోడలను కూడా టచ్ చేయకుండా ఉండాలని కఠినమైన నిబంధనలు ఉన్నాయి. మూసా బాగ్ చారిత్రక ప్రదేశం కావడంతో ఇలాంటికఠినమైన నిబంధనలు ఉన్నాయి. అందుకే సినిమా షూటింగుకు అనుమతి ఇవ్వలేదు.
మరో లొకేషన్ కోసం...
మూసాబాగ్లో అనుమతి లభించక పోవడంతో ఫైట్ సీన్ చిత్రీకరణ కోసం వేరే లొకేషన్ కోసం సెర్చ్ చేస్తున్నారు. అయితే ఈ ఆలస్యం సినిమా ఓవరాల్ షూటింగ్ షెడ్యూల్ మీద ప్రభావం చూపే అవకాశం ఉంది.
భరత్ అను నేను
నిర్మాత డి.వి.వి.దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. మహేష్ సరసన హీరోయిన్ గా కైరా అద్వాని నటిస్తోంది. ప్రకాష్రాజ్ ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రాన్ని జనవరి 11న సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. డి.వి.వి.ఎంటర్టైన్మెంట్స్ ఎల్ఎల్పి బేనర్పై నిర్మాణమవుతున్న ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్, సినిమాటోగ్రఫీ: రవి కె.చంద్రన్, నిర్మాత: డి.వి.వి.దానయ్య, దర్శకత్వం: కొరటాల శివ.