‘మా’ వివాదం: రాజేంద్రప్రసాద్, మరళీమోహన్లకు నోటీసులు
హైదరాబాద్: రాజేంద్రప్రసాద్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నిక కాక ముందు నుండే ఎన్నికల నిర్వహణపై వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల నిర్వహణ సరిగా లేదని నటుడు ఓ కళ్యాణ్ పిటీషన్ దాఖలు చేయడంతో ఆ మధ్య ఎన్నికల ఫలితాలు వాయిదా పడ్డాయి కూడా.
మార్చి 29న ఎన్నికలు జరిగినా...కోర్టు వివాదం కారణంగా ఏప్రిల్ 17 వరకు ఫలితాలు వెలువడలేదు. అయితే అప్పట్లో కోర్టు పిటీషన్ కొట్టివేయడంతో ఫలితాలకు లైన్ క్లియర్ అయింది. ఫలితాల అనంతరం రాజేంద్రప్రసాద్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఏప్రిల్ 19న రాజేంద్రప్రసాద్ ‘మా' అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసారు.

తాజాగా మరోసారి ఓ కళ్యాణ్ ‘మా' ఎన్నికలపై పై కోర్టులో పిటీషన్ దాఖలు చేసారు. ఈ మేరకు కొత్తగా అధ్యక్షుడిగా ఎన్నికైన రాజేంద్రప్రసాద్, మాజీ అద్యక్షుడు రాజేంద్రప్రసాద్, శివాజీ రాజాలకు కోర్టు నోటీసులు జారీ చేసింది. మరి ఈ కోర్టు వివాదం ఎక్కడి వరకు వెలుతుందో? ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











