Don't Miss!
- News బీఆర్ఎస్కు భారీ షాక్: ఎంపీ కే కేశవరావు, మేయర్ విజయలక్ష్మి కాంగ్రెస్లోకి
- Sports RR vs DC: రియాన్ పరాగ్ విధ్వంసం.. 6 బంతుల్లో 5 బౌండరీలు!
- Lifestyle ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
‘మా’ వివాదం: రాజేంద్రప్రసాద్, మరళీమోహన్లకు నోటీసులు
హైదరాబాద్: రాజేంద్రప్రసాద్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నిక కాక ముందు నుండే ఎన్నికల నిర్వహణపై వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల నిర్వహణ సరిగా లేదని నటుడు ఓ కళ్యాణ్ పిటీషన్ దాఖలు చేయడంతో ఆ మధ్య ఎన్నికల ఫలితాలు వాయిదా పడ్డాయి కూడా.
మార్చి 29న ఎన్నికలు జరిగినా...కోర్టు వివాదం కారణంగా ఏప్రిల్ 17 వరకు ఫలితాలు వెలువడలేదు. అయితే అప్పట్లో కోర్టు పిటీషన్ కొట్టివేయడంతో ఫలితాలకు లైన్ క్లియర్ అయింది. ఫలితాల అనంతరం రాజేంద్రప్రసాద్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఏప్రిల్ 19న రాజేంద్రప్రసాద్ ‘మా' అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసారు.
తాజాగా మరోసారి ఓ కళ్యాణ్ ‘మా' ఎన్నికలపై పై కోర్టులో పిటీషన్ దాఖలు చేసారు. ఈ మేరకు కొత్తగా అధ్యక్షుడిగా ఎన్నికైన రాజేంద్రప్రసాద్, మాజీ అద్యక్షుడు రాజేంద్రప్రసాద్, శివాజీ రాజాలకు కోర్టు నోటీసులు జారీ చేసింది. మరి ఈ కోర్టు వివాదం ఎక్కడి వరకు వెలుతుందో? ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో చూడాలి.