Don't Miss!
- News కేశినేని నాని Vs చిన్ని వార్ లో షర్మిల కొత్త ట్విస్ట్..!!
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Sports సూపర్మ్యాన్ స్టబ్స్: మెరుపు ఫీల్డింగ్తో ఢిల్లీని గెలిపించాడు! Video
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
‘మా’ వివాదం: రాజేంద్రప్రసాద్, మరళీమోహన్లకు నోటీసులు
హైదరాబాద్: రాజేంద్రప్రసాద్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నిక కాక ముందు నుండే ఎన్నికల నిర్వహణపై వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల నిర్వహణ సరిగా లేదని నటుడు ఓ కళ్యాణ్ పిటీషన్ దాఖలు చేయడంతో ఆ మధ్య ఎన్నికల ఫలితాలు వాయిదా పడ్డాయి కూడా.
మార్చి 29న ఎన్నికలు జరిగినా...కోర్టు వివాదం కారణంగా ఏప్రిల్ 17 వరకు ఫలితాలు వెలువడలేదు. అయితే అప్పట్లో కోర్టు పిటీషన్ కొట్టివేయడంతో ఫలితాలకు లైన్ క్లియర్ అయింది. ఫలితాల అనంతరం రాజేంద్రప్రసాద్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఏప్రిల్ 19న రాజేంద్రప్రసాద్ ‘మా' అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసారు.
తాజాగా మరోసారి ఓ కళ్యాణ్ ‘మా' ఎన్నికలపై పై కోర్టులో పిటీషన్ దాఖలు చేసారు. ఈ మేరకు కొత్తగా అధ్యక్షుడిగా ఎన్నికైన రాజేంద్రప్రసాద్, మాజీ అద్యక్షుడు రాజేంద్రప్రసాద్, శివాజీ రాజాలకు కోర్టు నోటీసులు జారీ చేసింది. మరి ఈ కోర్టు వివాదం ఎక్కడి వరకు వెలుతుందో? ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో చూడాలి.