Don't Miss!
- News బీఆర్ఎస్కు భారీ షాక్: ఎంపీ కే కేశవరావు, మేయర్ విజయలక్ష్మి కాంగ్రెస్లోకి
- Sports RR vs DC: రియాన్ పరాగ్ విధ్వంసం.. 6 బంతుల్లో 5 బౌండరీలు!
- Lifestyle ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
రామ్ గోపాల్ వర్మ తాజా చిత్రం 'ఆవహం'
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ త్వరలో తన సమర్పణలో 'ఆవహం' అనే చిత్రాన్ని అందించటానికి సన్నాహాలు చేస్తున్నారు.ఈ చిత్రం హిందీలో ఆయన రూపొందించిన ఫూంక్(తెలుగు రక్ష)కి సీక్వెల్. అయితే ఫూంక్ ని తెలుగులో జగపతిబాబు,కళ్యాణి కాంబినేషన్లో రీమేక్ చేసారు. అయితే ఫూంక్-2 ని మాత్రం డైరక్ట్ గా డబ్బింగ్ చేసి 'ఆవహం' పేరుతో రిలీజ్ చేస్తున్నారు. చేతబడులు చుట్టూ ఫూంక్ కథనం నడుస్తుంది. ఈ సీక్వెల్ కూడా అదే తరహా క్షుద్ర విద్యలు, ఆత్మలు, పగ, ప్రతీకారం చుట్టూ తిరుగుతుందని చెప్తున్నారు. ఇక ఫూంక్ లో హీరోగా చేసిన కన్నడ స్టార్ సుదీప్ ఈ చిత్రంలోనూ ప్రధాన పాత్రను చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని సార్థక్ మూవీస్ ప్రైలి, జెడ్ త్రీ పిక్చర్స్ సంస్థ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
తెలుగు, తమిళ్, హిందీల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మిలింద్ గడాక్కర్ దర్శకుడు...బుర్రా ప్రశాంత్ నిర్మాత. ఇక ఈ సీక్వెల్ విషయమై వర్మ మాట్లాడుతూ "రక్ష చిత్రానికి సరైన కొనసాగింపు 'ఆవహం'. మొదటి భాగంలో తన పాప కోసం రాజీవ్లో ఆందోళన కనిపిస్తుంది. తన పాపకు చేతబడి చేసిన మంత్రగాణ్ని చంపిస్తాడు. అతగాడు ప్రేతాత్మ రూపంలో వస్తే రాజీవ్ కుటుంబ పరిస్థితులు ఎలా ఉంటాయనే అంశం చుట్టూ 'ఆవహం' నడుస్తుంద"న్నారు. అలాగే "రక్షకీ ఈ సినిమాకీ భయపెట్టే విషయంలో చాలా తేడాలుంటాయి. సాంకేతికంగా ఉన్నతస్థాయిలో తీర్చిదిద్దుతున్నాం. ఫిబ్రవరిలో దీన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామ"న్నారు నిర్మాత. ఇక ఈ చిత్రం కూడా రక్ష రేంజిలో ఆడుతుందా లేక మరింత హిట్ అవుతుందో చూడాలి.