మగాళ్లు ఎంజాయ్ కోసం చేసా...
తన 'లెస్బియన్' యాక్ట్ ను సమర్ధించుకుంటూ తొలిసారిగా నీతూచంద్ర నోరు విప్పింది. 'నా చర్య మగవాళ్లు ఎంజాయ్ చేయడానికే' అంటూ చెప్పుకొచ్చింది. ఆ మధ్య ఓ ఫైవ్ స్టార్ హోటల్లో లెబ్సియన్ గా ఫోట్ షూట్ కి అటెండయిన ఆమె దాన్నో వివాదంగా మార్చి హైప్ క్రియోట్ చేస్తోంది. ఈ విషయమై మీడియాతో మాట్లాడుతూ...ఈ విషయమై ఇంతవరకూ చాలా మంది చాలారకంగా మాట్లాడారు...నన్ను రకరకాలుగా పోల్చారు...లెస్బియన్ షూట్ అన్నారు. నా ఫోటో షూట్ భారతీయ పురుషులు జీర్ణించుకోలేనంత హాట్ గా ఉండటం వల్లనే అడ్డుకునే ప్రయత్నం చేశారు అని తేల్చేసింది.
భారత సినీ చరిత్రలోనే ఇలాంటి ఫోటో షూట్ ఇంతవరకూ చోటుచేసుకోలేదు' అందుకే అంత వివాదం చెలరేగుతోంది. అయినా అజంతా, ఎల్లోరా గుహల్లోని కళాఖండాలను తిలకించేందుకు ప్రపంచవ్యాప్తంగా టూరిస్టులు నిత్యం వస్తుంటారు కదా, అలాంటి కళాత్మక దృష్టితోనే ఇద్దరు అందమైన అమ్మాయిల శరీరాలు ఒకరికొకరు తాకిస్తూ ఫోజులిస్తే ఎందుకు చూడలేకపోతున్నారని నీతూ సూటిగా ప్రశ్నించింది. ఇవన్నీ సరే గానీ మరో అమ్మాయి ప్రెవేట్ పార్ట్ లను టచ్ చేయడం నీకు ఎలాంటి అనుభూతినిచ్చిందని అడిగితే 'షూట్ కు ముందు ఆమె ఎవరో కూడా నాకు తెలియదు. ఫోటో షూట్ లో ప్రతి ఫోటో వెనుక ఓ కథ ఉంది. ఎక్కడా ముద్దు ఘట్టాలు కూడా లేవు. నేను నటిని. ఒక పాత్రను పోషించిన విధంగానే ఇందులో నటించానంతే' అని సమాధానమిచ్చింది. ఏదైమైనా మగాళ్ళ ఆనందం కోసమే ఇదంతా అని తేల్చేసింది.


Click it and Unblock the Notifications











