వైరల్ : రకుల్ ఏందీ భీభత్సం..సిద్దార్థ్ మల్హోత్రాతో కలసి రచ్చ రచ్చ..!
రకుల్ డిమాండ్ సౌత్ లో బాగా తగ్గిందనే నిజాన్ని అందరూ అంగీకరించాల్సిందే. అందుకే ఉత్తరాదికి వెళ్లి ప్రతాపం చూపిస్తోంది. రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ లో తాజాగా నటించిన చిత్రం అయ్యారే. సిద్దార్థ్ మల్హోత్రాతో కలసి రకుల్ ఈ చిత్రంతో నటించింది. ప్రమోషన్ కార్యమ్రాలల్లో రకుల్ భీభత్సంగా బీభత్సంగా పాల్గొంటూ రచ్చ చేస్తోంది. తాజగా ఓ కాలేజీలో ప్రమోషన్ కోసం వెళ్లిన వీళ్ళిద్దరి ఘాటు ప్రవర్తన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రకుల్ ఈ బోల్డ్ మూమెంట్స్ ఏంటని చర్చించుకుంటున్నారు.
Recommended Video


స్పైడర్ తరువాత తిరగబడిన జాతకం
రకుల్ ప్రీత్ సింగ్ జాతకం స్పైడర్చిత్రంతో తిరగబడింది. రకుల్ తన కెరీర్ లో సక్సెస్ రేట్ తక్కువగా ఉంది. దానికి తోడు భారీ ఆశలు పెట్టుకున్న స్పైడర్ చిత్రం డిజాస్టర్ కావడంతో రకుల్ కు టాలీవుడ్ లో దాదాపుగా దారులు మూసుకుని పోయాయి.

గ్లామర్ మోతాదు పెంచే ప్రయత్నం
గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో రకుల్ ప్రీత్ సింగ్ ఘాటు ఫోటో షూట్ లు వైరల్ గా మారుతున్నాయి. లోదుస్తుల్లో రకుల్ చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. ఈ గ్లామర్ పాట్లు సినీ అవకాశాలకోసమే అని నెటిజన్స్ కామెంట్లు పెడుతన్నారు. అవకాశాలు తాగక హీరోయిన్లు చివరి అస్త్రంగా గ్లామర్ బాణాన్ని విసరడం కామనే కదా అని ఫాన్స్ చర్చించుకుంటున్నారు.

బాలీవుడ్ వేట మొదలు పెట్టింది
సౌత్ లో అవకాశాలు బాగా సన్నగిల్లడంతో రకుల్ భామ బాలీవుడ్ లో వేట మొదలు పెట్టింది. రకుల్ తాను నటించిన అయ్యారే చిత్రం ప్రమోషన్ లో తెగ పాల్గొంటూ పాపులారిటీ సొంతం చేసుకునే ప్రయత్నాలు మొదలు పెట్టింది.

పబ్లిక్ గా ఇవేం చేష్టలు
రకుల్ ప్రీత్ సింగ్, సిద్దార్థ్ మల్హోత్రా ఇటీవల ఢిల్లీ లోని ఓ కళాశాలలో ప్రమోషన్ ఈవెంట్ కోసం వవెళ్లారు. అక్కడ సిద్దార్థ్ తో కలసి రకుల్ చేసిన రచ్చ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రకుల్ నడుముని పట్టుకుని సిద్ధార్థ్ రొమాంటిక్ గా పైకి లేపుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.


Click it and Unblock the Notifications











