మంచు కొండల్లో మజా చేస్తూ.... ఉపాసనతో చెర్రీ, స్నేహారెడ్డితో బన్నీ!
అల్లు అర్జున్, స్నేహారెడ్డి, రామ్ చరణ్, ఉపాసన, అల్లు శిరీష్ అంతా కలిసి హాలిడే ట్రిప్ వెళ్లారు. అంతా కలిసి హిమాలయాస్ రిజీయన్ లోని మనాలి హిల్ స్టేషన్ వెళ్లినట్లు సమాచారం.
శీతాకాలం ఇప్పుడిప్పుడే ప్రారంభం అవుతుండటంతో మెగా ఫ్యామిలీ స్టార్స్ మనసు హిమాలయాస్ రీజియన్ వైపు లాగినట్లుంది. వింటర్ ప్రారంభంలో ఇక్కడ యూరఫ్ దేశాల్లో మాదిరిగా ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. దాంతో పాటు హిమాలయాల అందాలు మరింత అద్భుతంగా కనువిందు చేస్తాయి. ఇలాంటి సమయంలో ట్రెక్కింగ్ చేస్తే ఆ మజాయే వేరు.
Recommended Video

హిమాలయాస్ రీజియన్లోని ప్రకృతి అందాలను ఆస్వాదించేందుకు మెగా ఫ్యామిలీ స్టార్స్ రామ్ చరణ్, ఉపాసన, అల్లు అర్జున్, స్నేహారెడ్డి, అల్లు శిరీష్ మనాలి హిల్ స్టేషన్ వెళ్లారు.

భార్యతో కలిసి బన్నీ
రామ్ చరణ్, ఉపాసన, అల్లు అర్జున్, స్నేహా రెడ్డి, అల్లు శిరీష్ అంతా కలిసి మనాలి హిల్ స్టేషన్ ప్రాంతంలో ట్రెక్కింగ్ చేస్తున్నట్లు వారు తాజాగా సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఫోటోలను బట్టి తెలుస్తోంది.

మనాలిలో కొండ అంచున రామ్ చరణ్
చాలా కాలం తర్వాత ఇలా మెగా ఫ్యామిలీ హీరోలైన రామ్ చరణ్, బన్నీ తమ ఫ్యామిలీస్తో కలిసి హాలిడే ట్రిప్పుకు వెళ్లారు. మంచు కొండల్లోని ఆ మజాను ఆస్వాదిస్తూ గడిపారు.

మంచు ప్రాంత కుందేలుతో శిరీష్
వీరితో పాటు అల్లు శిరీష్ కూడా వెళ్లారు. అక్కడి మూమెంట్స్ను కెమెరాలో బంధిస్తూ..... ఆ ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు. శిరీష్ పోస్టు చేసిన మనాలి పకృతి అందాల ఫోటోలు ఎంతో అద్భుతంగా ఉన్నాయి.

ప్రకృతి అందాలు
మనాలి హిల్ స్టేషన్లో ప్రకృతి అందాలు ఎంతో అద్భుతంగా ఉన్నాయని చెబుతూ శిరీష్ పోస్టు చేసిన ఫోటోల్లో ఇదీ ఒకటి.

బర్రెపై రామ్ చరణ్
మంచు కొండల్లో రామ్ చరణ్ దంపతులు చాలా సరదాగా గడిపారు. చెర్రీనీ బర్రెపై తిప్పుతున్న ఉపాసన ఇక్కడ ఫోటోల చూడొచ్చు.


Click it and Unblock the Notifications











