Don't Miss!
- News ఎమ్మెల్యే రాజా సింగ్ పై కేసు నమోదు
- Sports PBKS vs MI: రోహిత్ శర్మ ట్రేడ్ మార్క్ సిక్సర్.. హార్దిక్ రియాక్షన్ వైరల్! వీడియో
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
శ్రీదేవి బర్త్ డే పార్టీ - సెలబ్రేటీలు హంగామా...(ఫోటోలు)
ముంబై : తెలుగు, తమిళ, మలయాళ, హిందీ చిత్రాలలో నటించి అందరి మనసులను దోచుకున్న అతిలోక సుందరి శ్రీదేవి తన 50 వ జన్మదినాన్ని ఘనంగా చేసుకుంది. ఈ పుట్టిన రోజుని పురస్కరించుకుని భర్త బోని కపూర్ ఇచ్చిన విందులో బాలీవుడ్ కళకళలాడింది. బోని కపూర్ ఏర్పాటు చేసిన విందుకు బాలీవుడ్ కు చెందిన ప్రముఖులు, తారలు తరలివచ్చారు.
విందుకు హాజరైన వారిలో బాలీవుడ్ తారలు శిల్పా శెట్టి, సుస్మితా సేన్, హేమా మాలిని, ఇషా డియోల్, జూహీ చావ్లాలతోపాటు దర్శకులు అబ్బాస్ మస్తాన్, బంటీవాలియా, రమేశ్ తరానీ, గిరిష్ తరానీ, మధుర్ బండార్కర్, రాజ్ కుమార్ సంతోషి, జయ్ మెహతా, రిషి కపూర్, మనోజ్ బాజ్ పేయ్, వినోద్ ఖన్నా, అనుపమ్ ఖేర్, అనిల్ కపూర్ లు సంగీత దర్శకులు అను మాలిక్, బప్పిల హరి లుహాజరయ్యారు.
తమిళనాడులో పుట్టిన ఆమె ఈ రోజు తన 50వ పుట్టిన రోజు జరుపుకుంటుంది. 1975లో జూలీ సినిమాతో బాల నటిగా మనకు పరిచయం అయిన శ్రీదేవి ఎన్.టి.ఆర్, ఏఎన్ఆర్ లతో ఎన్నో సినిమాల్లో నటించింది. అంతే కాకుండా చిరంజీవి, నాగార్జునతో కూడా పలు సినిమాల్లో నటించి అందరి ప్రశంసలు పొందింది. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ ఎన్నో సినిమాల్లో నటించిన బోని కపూర్ ను వివాహం చేసుకొన్న తరువాత సినిమాలకు దూరం అయ్యింది. ఇటీవలే 'ఇంగ్లీష్ వింగ్లీష్' సినిమాతో తిరిగి రీ ఎంట్రీ ఇచ్చింది.
బర్తడే ఫంక్షన్ కి హాజరైన ప్రముఖులు..స్లైడ్ షోలో...
శ్రీదేవి ఇలా స్టైలిష్ గా...
శ్రీదేవి తన పుట్టిన రోజు పార్టీలో చాలా ఉషారుగా ఉంది. దానికి తగినట్లే ఆమె చాలా మోడ్రన్ గా స్టైలిష్ గాతయారై వచ్చింది. ఆమె కూతుళ్లకే ఆమె పోటి ఇచ్చిందని అందరూ మాట్లాడుకున్నారు. ఆమె పార్టీకి ఆమె సన్నిహితులు అంతా హాజరై విషెష్ తెలిపారు.
తండ్రి, కూతురు
తల్లి పుట్టిన రోజు వేడుకల్లో ఇలా కూతురు ముచ్చటగా తన తండ్రి బోని కపూర్ తో కలిసి ఫోజిచ్చింది. ఆయనకు తన చిన్న బిడ్డంటే ప్రాణం. ఆ విషయం ఎప్పుడూ చెప్తూంటారు. అలాగే ఆమె అల్లరి పిల్ల అని కితాబు ఇస్తూంటారు. ఆమె కూడా ఎప్పుడూ తన తండ్రిని విడిచిపెట్టదు.
సుస్మితా సేన్
శ్రీదేవికు ఉన్న మంచి స్నేహితురాళ్లలో సుస్మితా సేన్ ఒకరు. ఆమె ఈ పంక్షన్ లో తన స్నేహితురాళ్లందరినీ కలుసుకున్నానని ఆనందంగా మీడియాకు చెప్పింది. శ్రీదేవి ఇంకా అందంగా ఈ వయస్సులోనూ మెరిసిపోతోందని కితాబు ఇచ్చింది.
రితీష్, జెనీలియా
బాలీవుడ్ యువ జంటలలో ఒకరైన జెనీలియా,రితీష్ ఈ పంక్షన్ కు ప్రత్యేకార్షణగా నిలిచారు. జెనీలియా వెళ్లి కౌగలించుకుని శ్రీదేవికి విషెష్ తెలియచేసింది. రితీష్ తండ్రి కాలం నుంచి బోనీకి ఆ కుటుంబానికి మంచి సంభంధ భాంధవ్యాలు ఉన్నాయి.
సోనాల్ చౌహాన్
తెలుగులోనూ కొన్ని చిత్రాల్లో నటించిన సోనాలి చౌహాన్ ఈ పంక్షన్ కి హాజరై..శ్రీదేవి కి విషెష్ తెలియచేసింది. ఆ పంక్షన్ కి వెళ్లటం తన కెంతో ఆనందం కలిగించంటూ ఆమె చెప్పుకొచ్చింది. ఆ పంక్షన్ పూర్తయ్యేదాకా ఆమె అక్కడే ఉంది.
శిల్పాశెట్టి
శిల్పా శెట్టి తన భర్త రాజ్ కుందర్ తో కలిసి ఈ పంక్షన్ కి వచ్చింది. ఆమె శ్రీదేవి చిర కాల స్నేహితురాళ్లు. ఆమె తరుచుగా శ్రీదేవిని కలుస్తూనే ఉంటుంది. ఈ పంక్షన్ కి రావటంతో శ్రీదేవి దగ్గరుండి లోపలకి తీసుకు వచ్చింది.
హేమమాలిని
శ్రీదేవికి ఉన్న మంచి స్నేహితురాళ్లలో హేమ మాలిని ఒకరు. దాంతో హేమ మాలిని తన పనులు అన్నీ ప్రక్కన పెట్టి శ్రీదేవి పుట్టిన రోజు వేడుకలకు హాజరై విషెష్ తెలిపింది. ఇద్దరూ దాదాపు ఒకే ఏజ్ గ్రూప్ కు దగ్గర వారు కావటంతో చాలా విషయాలు ముచ్చటించుకున్నారు.
ఇషా డయోల్
హేమ మాలిని కుమార్తె ఇషా డయోల్ ఇలా తన దైన శైలిలో డ్రస్ చేసుకుని వచ్చి పంక్షన్ లో స్పెషల్ ఎట్రాక్షన్ గా మెరిసిపోయింది. ఆమె భర్తకూడా ఆమెతో పాటే ఉన్నారు. హేమ మాలిని కుమార్తె అయిన ఇషా ..ని శ్రీదేవి ప్రత్యేక ఆహ్వానితురాలిగా చెప్పింది.
సుబ్బిరామి రెడ్డి
తెలుగు నుంచి వెళ్లిన ప్రత్యేక అతిధి సుబ్బిరామి రెడ్డి. సుబ్బిరామి రెడ్డికి బోని కపూర్ కి ప్రత్యేకమైన స్నేహ బంధం ఉంది. అలాగే శ్రీదేవిని సైతం ఆయన అభిమానిస్తారు. అందుకోసం ఆయన ముంబై వెళ్లి ఆమె పుట్టిన రోజు పంక్షన్ లో పాల్గొన్నారు. బోని కపూర్ దగ్గరుండి ఆయన్ని లోపలకి ఆహ్వానించారు.
లారా దత్తా
లారాదత్తా తన భర్త మహేష్ భూపతి తో కలిసి ఈ పంక్షన్ కి వచ్చింది. లారాదత్త తెలుగులో సైతం నటించింది. ఆమె గతంలో బోనీ కపూర్ నిర్మించిన సినిమాలు చేసింది. ఆ అనుబంధంతో ఆమె ఈ పంక్షన్ కి హాజరైంది.
రాకేష్ రోషన్ ..
తోటి నిర్మాతగానే కాకుండా రాకేష్ రోషన్ కి, బోనీ కపూర్ కి మంచి స్నేహం ఎప్పటినుంచో ఉంది. దాంతో ఆయన భార్యతో కలిసి ఈ పంక్షన్ కి వచ్చారు. శ్రీదేవి ఎదురు వెల్లి ఆయన నుంచి విషెష్ స్వీకరించింది.
రిషి కపూర్...
తన సోదరుడు రణధీర్ కపూర్ తో కలిసి ..రిషి కపూర్ ఈ పార్టీలో కనిపించారు. ఇద్దరు మాట్లాడుకుంటూ కూర్చున్నారు. శ్రీదేవి ఈ సోదరిలిద్దరినీ ప్రత్యేకమైన ఆహ్వానం తో పిలిచి... విషెష్ తీసుకుంది.
మెరిస్తూ శ్రీదేవి...
ప్రముఖనిర్మాత బోనీకపూర్ తో వివాహం అనంతరం శ్రీదేవి చాలా కాలం సినిమాలకు దూరంగా ఉంది. అయితే మొన్నామధ్య 'ఇంగ్లిష్ వింగ్లిష్'తో మళ్లీ తానేంటో ప్రూవ్ చేసుకుంది. ఇక శ్రీదేవికి జాహ్నవి, కుషి అని ఇద్దరు ఆడపిల్లలున్నారు. ఇద్దరు పిల్లల తల్లి అయినా ఇప్పటికి చెక్కుచెదరని అందంతో కనిపించే శ్రీదేవి పుట్టిన రోజు పంక్షన్ లో ఇలా మెరిసిపోయింది.