twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బిగ్‌బాస్ షోకు మరో షాక్: నిలిపివేయాలంటూ వాజ్యం... ప్రతివాదిగా నాగార్జున!

    |

    Recommended Video

    Bigg Boss Telugu 3 : Nagarjuna's Bigg Boss Telugu In Deep Trouble,Here's Why ?

    నాగార్జున హోస్ట్‌గా త్వరలో ప్రారంభం కాబోయే బిగ్ బాస్ షోకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే జర్నలిస్ట్ శ్వేతా రెడ్డి, నటి గాయిత్రి గుప్తా ఈ షోపై పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ రియాలిటీ షో నిలిపి వేయాలని కోరుతూ తెలంగాణ హై కోర్టులో ప్రజా ప్రయోజన వాజ్యం దాఖలైంది. తెలుగు దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి ఈ పిల్ వేశారు.

    కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి దాఖలు చేసిన పిల్‌లో నాగార్జునతో పాటు మరో 10 మందిని ప్రతివాదులుగా చేర్చడం చర్చనీయాంశం అయింది. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ షోపై నీలి నీడలు కమ్ముకన్నట్లయింది. దీనిపై కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది ఆసక్తిగా మారింది.

    బిగ్ బాస్ షోను సెన్సార్ చేయాలి

    బిగ్ బాస్ షోను సెన్సార్ చేయాలి

    సినిమాలకు ఎలా సెన్సార్ చేస్తారో అశ్లీలత, డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉన్న ఈ బిగ్ బాస్ గేమ్ షో కూడా సెన్సార్ చేయాలని కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి కోర్టును కోరారు. ఇండియన్ బ్రాడ్‌కాస్టింగ్ ఫౌండేషన్ (ibf)చట్టాలను అనుసరించి చర్యలు తీసుకోవాలని తన వాజ్యంలో పేర్కొన్నారు.

    వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి

    వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి

    సెలెక్షన్స్ నేపథ్యంలో మహిళలను కమిట్మెంట్ పేరుతో మానసిక ఒత్తిడి‌కి గురిచేస్తున్న నిర్వాహకులపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని కేతిరెడ్డి కోర్టును కోరారు. గాయిత్రి గుప్తా, శ్వేతా రెడ్డి ఫిర్యాదులను ఈ సందర్భంగా కేతిరెడ్డి ప్రస్తావించారు.

    నాగార్జునతో పాటు 10 మంది ప్రతి వాదులు

    నాగార్జునతో పాటు 10 మంది ప్రతి వాదులు

    ఈ కేసులో మొత్తం ప్రతివాదులుగా 10 మందిని చేర్చారు. నటుడు నాగార్జున తో పాటు స్టార్ మా, ఐబిఎఫ్, ఎండిమాల్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర హోమ్ సెక్రెటరీ, హైదరాబాద్ జిల్లా కలెక్టర్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, సిటీ పోలీస్ కమిషనర్ ఉన్నారు.

    నాగార్జునపై కేతిరెడ్డి విమర్శలు

    నాగార్జునపై కేతిరెడ్డి విమర్శలు

    ఈ వ్యాజ్యాన్ని ప్రధాన నాయమూర్తి లంచ్ మోషన్ సమయంలో వినుటకు సిద్ధం అయ్యారని కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి మీడియాకు తెలిపారు. ఈ కేసును కేతిరెడ్డి తరుపున శాంతి భూషణ్ అనే న్యాయవాది వాదనలు వినిపిస్తున్నారు. అక్కినేని నాగార్జున అన్నమయ్య , భక్త రామదాసు, షిర్డీసాయి వంటి చిత్రాలలో నటించి ఇలాంటి షో లకు హోస్ట్‌గా ఉండడంపై కేతిరెడ్డి విమర్శలు చేశారు. షోను నిషేదించడానికి వీలుకానిచో... యువతను, పిల్లలను పెడదారి పట్టించే విధంగా ఉన్న ఈ కార్యక్రమాన్ని రాతకరి 11 గంటల తర్వాత ప్రసారం చేస్తే బావుంటుందని కేతిరెడ్డి తెలిపారు.

    క్వాష్ పిటీషన్ వేసిన బిగ్ బాస్ టీం

    క్వాష్ పిటీషన్ వేసిన బిగ్ బాస్ టీం

    కాగా... శ్వేతారెడ్డి, గాయిత్రి గుప్తా చేసిన ఫిర్యాదుపై బిగ్ బాస్ కోఆర్డినేషన్ టీమ్ కూడా హైకోర్టును ఆశ్రయించింది. బంజారాహిల్స్, రాయదుర్గం పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసులను కొట్టివేయాలని కోరుతూ క్వాష్ పిటిషన్ వేసింది.

    English summary
    Pil filled against Bigg Boss in telangana high court. Bigg Boss 3 Telugu is going on air from July 21 and in the last couple of days, the management of the show has been facing casting couch allegations.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X