Don't Miss!
- News పవన్ కళ్యాణ్, చంద్రబాబుల కేసుల చిట్టా ఇదే!!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Sports DC vs GT: అందుకే డేవిడ్ వార్నర్ను పక్కన పెట్టాం: రిషభ్ పంత్
- Lifestyle ఈ బ్లడ్ గ్రూప్ దొరకడం చాలా కష్టం..కొంటే ధర ఎంతో తెలుసా..?
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
సుమంత్ సినిమాలో విదేశీ హీరోయిన్
హైదరాబాద్ : హీరో సుమంత్ త్వరలో 'ఏమో గుర్రం ఎగరవచ్చు' అనే చిత్రం చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో హీరోయిన్గా విదేశీ భామను ఎంపిక చేసారు. బ్యాంకాక్(థాయ్లాండ్) చెందిన సవికా చైయదేచ్ ను హీరోయిన్ గా తీసుకున్నారు. ఇప్పటికే తమిళ సినిమా 'మార్కండేయన్' ద్వారా ఇండియన్ సినిమా రంగంలోకి అడుగు పెట్టిన సవికా చైయదేచ్ నిక్ నేమ్ పంకీ. ఇక్కడ అంతా ఆమెను పింకీ సవికా అని పిలుస్తుంటారు.
'ఏమో గుర్రం ఎగరవచ్చు' చిత్రానికి చంద్రసిద్ధార్థ దర్శకత్వం వహిస్తున్నారు. రచయిత, దర్శకుడు మదన్ 'ఆ నలుగురు ఫిలిమ్స్' పతాకంపై ఈ సినిమా నిర్మించబోతున్నారు. రాజమౌళి 'మర్యాద రామన్న'కు కథ అందించి, 'ఈగ'కు స్క్రిప్టు రైటర్ గా పనిచేసిన కాంచి ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే అందించారు.
గతంలో సుమంత్-చంద్రసిద్ధార్థ కాంబినేషన్లో 'మధుమాసం' సినిమా వచ్చింది. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం సంగీత చర్చలు సాగుతున్నాయి. చైతన్య ప్రసాద్ సాహిత్యం అందుస్తున్నారు. సగం ఇండియాలోనూ, సగం అమెరికాలోనూ కథ జరుగుతుంది. అందుకు తగిన విధంగా సినిమాను ఇక్కడ సగం, అక్కడ సగం చిత్రీకరించనున్నారు.
ఇటీవల ఈచిత్రం ప్రారంభోత్సవం రామానాయుడు స్టూడియలో అట్టహాసంగా జరిగింది. ఈచిత్రానికి కథ-మాటలు : ఎస్.ఎస్. కాంచి, కెమెరా : చంద్రమౌళి, ఆర్ట్స్ : నాగేంద్రబాబు, పాటలు : చైతన్య ప్రసాద్, సంగీతం : ఎంఎం. కీరవాణి, స్ర్కీన్ ప్లే-నిర్మాత : మదన్, సమర్పణ : నీల శంకర్, దర్శకత్వం : చంద్ర సిద్ధార్థ.