ప్లాస్లిక్ సర్జరీ తేడా కొట్టిందా? ఆ హీరోయిన్ను ఎవరూ గుర్తుపట్టడం లేదు!
ప్లాస్టిక్ సర్జరీ తర్వాత పూనమ్ ఝావర్ అందంగా ఉన్నప్పటికీ ఎవరూ గుర్తు పట్టని విధంగా మారిపోవడంతో.... సర్జరీ ఏదో తేడా కొట్టిందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ముంబై: 90వ దశకంలో బాలీవుడ్లో రిలీజైన మూవీ 'మోహ్రా'... సునీల్ శెట్టి, అక్షయ్ కుమార్, పూనమ్ ఝావర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం అప్పట్లో మంచి విజయం సాధించింది. ఈచిత్రం ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన పూనమ్ ఝావర్ నేచురల్ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకుంది.
పూనమ్ ఝావర్ టీనేజ్లో ఉన్నపుడే హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం పూనమ్ వయసు 38 సంవత్సరాలు. అయితే ఆమె అప్పటి ఫోటోలకు, ఇప్పటి ఫోటోలకు చాలా తేడా ఉంది. ఒక రకంగా చెప్పాలంటే.... గుర్తు పట్టలేనంతగా మారిపోయింది. ఇదంతా ప్లాస్టిక్ సర్జరీ ఎఫెక్టే అంటున్నారు.

పూనమ్ ఎంట్రీ
అక్షయ్ కుమార్, సునీల్ శెట్టి నటించిన మోహ్రా చిత్రం ద్వారా పూనమ్ ఝావర్ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో పూనమ్ సునీల్ శెట్టి వైఫ్ ప్రియా అగ్నిహోత్రి పాత్రలో నటించింది. ఈ సినిమాలో దండుగులు ఆమెను రేప్ చేయడానికి ప్రయత్నించగా తనకు తానుగా ఆత్మహత్య చేసుకునే పాత్రలో పూనమ్ నటించింది.

పూనమ్ లేటెస్ట్ ఫోటోస్ వైరల్
పూనమ్ ఝావర్ ఇటీవలే ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంది. ప్లాస్టిక్ సర్జరీ తర్వాత పూనమ్ మరింత అందంగా కనిపిస్తోంది. వయసు కారణంగా పోయిన బ్యూటీ మళ్లీ తిరిగొచ్చినట్లయింది. ఆమెను చూసిన చాలా మంది ఈవిడే పూనమ్ ఝావర్ అంటే నమ్మలేక పోతున్నారు.

ప్లాస్టిక్ సర్జరీ తేడా కొట్టిందా
ప్లాస్టిక్ సర్జరీ తర్వాత పూనమ్ ఝావర్ అందంగా ఉన్నప్పటికీ ఎవరూ గుర్తు పట్టని విధంగా మారిపోవడంతో.... సర్జరీ ఏదో తేడా కొట్టిందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ప్రజలు గుర్తు పట్టలేదు
ప్లాస్టిక్ సర్జరీ తర్వాత ఇటీవల ఆమె ఓ పబ్లిక్ ప్లేసుకు వచ్చారు. అయితే లుక్స్ చాలా మారిపోవడంతో ఎవరూ ఆమెను గుర్తుపట్టలేక పోయారు.

ఓ మైగాడ్ మూవీలో...
పూనమ్ ఝావర్ చివరి సారిగా అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కిన హిందీ మూవీ ‘ఓ మై గాడ్' చిత్రంలో సాధ్వి గోపి మాయిగా కనిపించారు.


Click it and Unblock the Notifications











