Don't Miss!
- Lifestyle గాడిదపాలు అమ్మి కోట్ల వ్యాపారం.. లీటరు ధర రూ.7,000లు పైమాటే..!
- News పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలుపు కష్టమే ... ప్రముఖ నిర్మాత షాకింగ్ కామెంట్స్
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Sports IPL 2024: హార్దిక్ పాండ్యా చెత్త కెప్టెన్సీనే ముంబై ఇండియన్స్ కొంపముంచింది: క్రీడా మంత్రి
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
పవన్ కళ్యాణ్ గారు హెల్ప్ చేయండి: మహిళా నిర్మాత ట్వీట్
పవన్ కళ్యాణ్ హెల్ప్ కోరుతూ నిర్మాత ట్వీట్. నీలిమ తిరుమల శెట్టి ఈ ట్వీట్ చేశారు.
పవర్స్టార్ పవన్ కళ్యాణ్తో 'పంజా' సినిమా నిర్మించిన నీలిమా తిరుమలశెట్టి తాజాగా ట్విట్టర్లో చేసిన ట్వీట్ హాట్ టాపిక్ అయింది. పవన్ కళ్యాణ్ సహాయం కోరుతూ ఆమె ట్వీట్ చేశారు. అయితే ఎలాంటి? హెల్ప్ కావాలి? ఎందుకు ఆమె ఈ ట్వీట్ చేశారు? అనేది తెలియడం లేదు.
పవన్ కళ్యాణ్తో 'పంజా' చిత్రం నిర్మించిన నీలిమ ఈ సినిమా ద్వారా నష్టాలు చవిచూసిన సంగతి తెలిసిందే. ఆ సినిమా తర్వాత 'అలియాస్ జానకి' అనే చిత్రాన్ని తెరకెక్కించారు. 2013లో వచ్చిన ఈ సినిమా కూడా ఆడక పోవడంతో నీలిమ మళ్లీ సినిమాలు తీయలేదు.
ఇన్నాళ్లకు మళ్లీ?
సినిమాలు లేకపోవడంతో నీలిమ తిరుమలశెట్టి కూడా వార్తల్లో లేకుండా పోయారు. మళ్లీ ఇన్నాళ్లకు ఆమె పవన్ కళ్యాణ్ హెల్ప్ కోరుతూ ట్వీట్ చేసి వార్తల్లో వ్యక్తిగా మారారు. ‘ ప్లీస్ హెల్ మి పవన్ కళ్యాణ్ గారు' అంటూ ఆమె ట్వీట్ చేశారు.
ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారా?
ఆర్థికంగా నష్టపోవడంతో నీలిమ తిరుమలశెట్టి 2013 తర్వాత మళ్లీ సినిమాలు చేయలేదు. తనకు ఓ సినిమా చేసే అవకాశం ఇవ్వాలని ఆమె ఈ ట్వీట్ చేశారా? లేక మరేదైనా కారణంతో చేశారా? అనేది తెలియాల్సి ఉంది.
ట్వీట్ డిలీట్
సెప్టెంబర్ 4వ తేదీన ఆమె ఈ ట్వీట్ చేశారు. అయితే ఇపుడు ఆ ట్వీట్ ఆమె ట్విట్టర్ అకౌంట్లో కనిపించడం లేదు. విషయం పవన్ కళ్యాణ్ వరకు చేరడంతో వెంటనే ఆట్వీట్ డిలీట్ చేసినట్లు తెలుస్తోంది.
పవన్ స్పందించారా?
ఆమె ట్వీట్ డిలీట్ చేశారు కాబట్టి పవన్ కళ్యాణ్.... ఆమె విన్నపంపై స్పందించినట్లు ఇండస్ట్రీలో చర్చించుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ తనను నమ్ముకున్న వారిని, అభిమానులను, కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడంలో ముందుంటలారనే విషయం తెలిసిందే.