Don't Miss!
- News Telangana Governor: తెలంగాణ గవర్నర్గా సీపీ రాధాకృష్ణన్-తమిళి సై రాజీనామా ఆమోదం..!
- Finance Adani News: చిక్కుల్లో గౌతమ్ అదానీ.. అదానీ గ్రూప్పై అమెరికా న్యాయ శాఖ దర్యాప్తు..!!
- Sports PSL Final: ఉత్కంఠ పోరులో ఆఖరి బంతికి విజయం Video
- Automobiles కదిలే ఇంద్రభవనమా? ఏంటిది మరి!.. వీడియో చూడాల్సిందే
- Technology ఆకట్టుకొనే డిజైన్, AI ట్రిపుల్ కెమెరా, 6.7 డిస్ప్లేతో మోటోరోలా స్మార్ట్ఫోన్.. విడుదల, సేల్ వివరాలు..!!
- Lifestyle ఈపాప చూడటానికి చాలా అందంగా ఉంది, కానీ ఓ వింత రోగం తినరానివి తింటుంది! నా కూతుర్ని రక్షించండి!!
- Travel హోలీ సందర్భంగా దేశంలోని ఈ ప్రదేశాలను చుట్టేయండి..!
పవన్ కళ్యాణ్ సడన్ నిర్ణయం, పోలీసుల సలహా!
ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఒకవైపు చంద్రబాబు విజయవాడలో దీక్ష చేస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ ఫిలిం చాంబర్ కు నిరసన తెలపడానికి వచ్చిన సంగతి తెలిసిందే. పవన్ కు మద్దతు తెలపడానికి చరణ్, బన్ని ఛాంబర్ కు చేరుకోవడం జరిగింది. పవన్ కు నాగబాబు, వివి.వినాయక్, సాయి ధరమ్ తేజ్, నటుడు శివాజీ మద్దతు తెలిపారు.
ఒకవైపు పవన్ అభిమానులు భారి ఎత్తున ఛాంబర్ కు చేరుకోవడం జరిగింది. అభిమానులు పవన్ ను అన్యాయం చేసిన వారి అంతు చూస్తామని నినాదాలు చేస్తున్నారు. అభిమానులను కంట్రోల్ చెయ్యడం పోలిసుల వల్ల కావడం లేదు. అందుకు పవన్ను ఇంటికి వెళ్ళమని పోలీస్ వారు చెప్పినట్లు తెలుస్తోంది.
పోలీస్ వారి విజ్ఞప్తి మేరకు పవన్ ఛాంబర్ నుండి ఇంటికి వెళ్ళడం జరిగింది. పవన్ ఇంటికి వెళ్ళడంతో అక్కడి పరిస్థితి కొద్దివరుకు సర్దుమనిగినట్లు తెలుస్తోంది. మిగిలిన మెగా హీరోలు కూడా ఛాంబర్ నుండి ఇంటికి వెళ్ళినట్లు తెలుస్తోంది. నిరసన తెలిపేందుకు వచ్చిన పవన్ హటాత్తుగా వెళ్ళడం ఎవ్వరు ఉహించని పరిణామం.