Don't Miss!
- Sports RR vs DC: చరిత్ర సృష్టించిన రిషభ్ పంత్.. ఒకే ఒక్కడిగా..!
- News సీఎం జగన్ కొత్త ఎన్నికల నినాదం..డబుల్ సెంచరీ ప్రభుత్వం అంటూ
- Lifestyle ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
నాగార్జున కేసులో విచారణ ప్రారంభం
సినీ నటుడు నాగార్జున బెదిరింపులకు పాల్పడిన కేసులో పోలీసులు విచారణ ప్రారంభించారు. ఈ మేరకు నాగార్జునతో పాటు, అన్నపూర్ణ స్టూడియోస్లో పని చేసే వారిని, నాగార్జున బెదిరింపులకు పాల్పడిన సమయంలో ఉన్న పాత్రికేయుల దగ్గర నుంచి జూబ్లీ హిల్స్ పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ఈ కేసులో నాగార్జున నేరం రుజువైతే శిక్ష తప్పదంటున్నారు న్యాయ నిపుణులు.
తనను సినీనటుడు నాగార్జున అసభ్య పదజాలంతో దూషించడని, బెదిరింపులకు పాల్పడ్డాడని ఓ ఆంగ్ల పత్రిక విలేకరి వై.సునీత చౌదరిపై ఇటీవల నాగర్జునపై జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నాగ్పై ఐపిసి 506, 509 సెక్షన్ కింద కేసులు నమోదు చేశారు.
నాగార్జున విగ్గుపెట్టుకుని సినిమాల్లో నటిస్తున్నారంటూ...సునీత చౌదరి గతంలో రాసిన ఓ ఆర్టికల్ ను మనసులో పెట్టుకున్న నాగార్జున ఇటీవల అన్నపూర్ణ స్టూడియోకు ప్రెస్ మీట్ కు వచ్చిన సునీత చౌదరిపై తన ప్రతాపం చూపాడని, బూతులు తిడుతూ దూషించాడని, బెదిరించాడని, అందుకే ఆమె నాగార్జునపై పోలీసులకు పిర్యాదు చేసిందని చర్చించుకుంటున్నారు.