Don't Miss!
- Finance ICICI: ఐసీఐసీఐ బ్యాంక్ డివిడెండ్ ప్రకటిస్తుందా..!
- News భోజనాలున్నాయమ్మా వెళ్లొద్దు.. విజయసాయికి షాక్; ఇజ్జత్ తీసిన టీడీపీ!!
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Sports RCB vs KKR: 500 టీ20 మ్యాచ్ ఆడబోతున్న ఐపీఎల్ స్టార్.. మ్యాన్ ఆఫ్ మెయిడెన్ ఓవర్స్
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
- Automobiles రూ. 10 లక్షల ధరలో టాటా నెక్సాన్ AMT కొత్త వేరియంట్లు విడుదల.. వివరాలివే.!!
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
ఫ్యాన్స్ బెదిరింపు: ఇళయారాజాపై పోలీసులకు ఫిర్యాదు
హైదరాబాద్: ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా మీద కంప్లైంట్ నమోదైంది. ఏజిఐ మ్యూజిక్ సంస్థ అధినేత అఖిలన్ ఆయనపై ఫిర్యాదు చేసారు. ఇళయరాజా పాటలకు సంబంధించి 2007లో తమ సంస్థ ఒక ఒప్పందం కుదుర్చుకుందని, ఈ ఒప్పందం కాల పరిమితి ముగియకుండానే ఇళయరాజా వేరే ఆడియో సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారని అఖిలన్ ఆరోపించారు. అంతే కాకుండా....అభిమానుల పేరుతో బెదిరింపులకు పాల్పడుతున్నారని కూడా ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఆ ఫిర్యాదు సంగతి అలా ఉంటే... ఏజిఐ మ్యూజిక్ సంస్థ తన పాటలను తస్కరిస్తోందంటూ ఇళయరాజా చెన్నై పోలీసు కమిషనర్ జార్జ్కు ఇంతకు ముందే ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి విచారణ ప్రారంభించారు. పోలీసులు తమను ఇబ్బంది పెడుతున్నారని, పోలీసుల ఓవర్ యాక్షన్ కారణంగా తాము ఇతర సినిమాల సీడీలను కూడా అమ్ముకోలేని పరిస్థితి ఉందని అఖిలన్ ఆరోపించారు.
ఇళయారాజా అభిమానులను తమను ఇంటర్నెట్ ద్వారా బెదిరింపులకు పాల్పడుతున్నారని, చంపేస్తామంటున్నారని....అందుకే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు అఖిలన్ తెలిపారు.