‘ఐ’ ఎఫెక్ట్: దర్శకుడు శంకర్ ఇంటికి పోలీసు భద్రత
చెన్నై: శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘ఐ' చిత్రానికి వ్యతిరేకంగా హిజ్రాలు, ట్రాన్స్ జెండర్స్ ఆందోళనకు సిద్ధమయ్యారు. ‘ఐ' సినిమాలోని కొన్ని సీన్లు తమ మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సినిమాలో సెలబ్రిటీ హెయిర్ స్టైలిస్ట్ పాత్ర ‘ఓస్మా'ను చిత్రీకరించిన తీరు తమ మనోభావాలు దెబ్బ తీసే విధంగా ఉందని ట్రాన్స్ జెండర్స్ ఆగ్రహంగా ఉన్నారు.
శంకర్ ఇంటి వద్ద, సెన్సార్ బోర్డు ఆఫీసు వద్ద ధర్నా చేస్తామని చెన్నై సిటీకి చెందిన ట్రాన్స్ జెండర్స్ కమ్యూనిటీ ప్రకటించింది. ఈ పరిణామాల నేపథ్యంలో శంకర్ ఇంటికి పోలీసులు భద్రత ఏర్పాటు చేసారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసారు.
ఫేస్బుక్ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు

‘ఐ' సినిమాలో ఓస్మా పాత్రను ఓజాస్ రజనీ పోసించారు. ఓజాస్ రజనీ ఐశ్వర్యరాయ్ తో పాటు పలవురు బాలీవుడ్ స్టార్స్ స్టైలిస్ట్ గా పని చేసారు. అయితే ఓస్మా పాత్రను విలన్ పాత్రగా చిత్రీకరించడంపై ట్రాన్స్ జెండర్స్ ఆగ్రహంగా ఉన్నారు. దర్శకుడు శంకర్ ఇంటి ముందు ఆందోళన చేసేందుకు సిద్దపడ్డారు.
ఈ చిత్రంలో విక్రమ్, అమీ జాక్సన్ హీరో హీరోయిన్లుగా నటించారు. శంకర్ దర్శకత్వం వహించాగా ఆస్కార్ ఫిలింస్ పతాకంపై రవిచంద్రన్ నిర్మించారు. తెలుగులో ఈ చిత్రాన్ని ఆస్కార్ ఫిలింస్, మెగా సూపర్ గుడ్ ఫిలింస్ సంయుక్తంగా నిర్మించారు. సినిమా ఓపెనింగ్స్ బావున్నాయని మెగా సూపర్ గుడ్ ఫిలింస్ అధినేతల్లో ఒకరైన ఎన్.వి.ప్రసాద్ ప్రకటించారు.


Click it and Unblock the Notifications











