Don't Miss!
- Sports రోహిత్ స్టార్ట్ చేశాడు.. ‘RIP హార్దిక్’ అంటూ పోస్ట్లు Video
- Finance Gold Loan: గోల్డ్లోన్స్ తీసుకున్నోళ్లకి హెచ్చరిక..! ఇవి తప్పక తెలుసుకోండి..
- News నీ భార్యతో ఎంజాయ్ చెయ్యాలని ఉంది, ఫ్రెండ్స్ పార్టీలో రియల్ ఎస్టేట్ వ్యాపారి భర్తకు ఆఫర్ !
- Lifestyle సంపూర్ణ సూర్యగ్రహణం 2024: అమెరికాలోని వందలాది పాఠశాలలకు సెలవు, ఎందుకో తెలుసా?ఆరోజు ఏం జరుగుతుందో తెలుసా
- Technology Samsung నుంచి గెలాక్సీ అల్ట్రా డేస్ సేల్! ఆఫర్ల వివరాలు
- Automobiles Ampere Nexus కశ్మీర్ టు కన్యాకుమారి 10,000 కి.మీ టెస్ట్ రైడ్ సక్సెస్.. ఇక ప్రత్యర్థి కంపెనీలకు వణుకే.!!
- Travel హోలీ సందర్భంగా దేశంలోని ఈ ప్రదేశాలను చుట్టేయండి..!
సూరి హత్య కేసులో విచారణకు రామ్ గోపాల్ వర్మ
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ని ఈ రోజు (సోమవారం)..మద్దెల చెవురు సూరి హత్య కేసులో సీసీఎస్ పోలీసులు విచారించనున్నట్లు సమాచారం. రక్త చరిత్ర పార్ట్-2 చిత్రీకరణ నిమిత్తం సూరి పెట్టుబడులు పెట్టాడన్న కోణంలో ఈ ఎంక్వైరీ జరగనుంది. సూరికి వర్మకి మధ్య కో ఆర్డనేటర్ గా భాను వ్యవహించాడని చెప్తున్నారు. ఇక భాను..రక్త చరిత్ర చిత్రం కు అవసరమైన లొకేషన్స్ ను చూపించడంలో సహాయపడ్డాడని ఇప్పటికే తెలుగువెర్షన్ నిర్మాత సి.కళ్యాణ్ పోలీసులకు తెలిపటం ఈ విచారణకు అవకాశమిచ్చింది. ఇదిలా ఉండగా మద్దెలచెరువు సూరి హత్యకేసులో ప్రధాన నిందితుడు భానుకిరణ్పై సీసీఎస్లో మరో కేసు నమోదు అయ్యింది. సినీ నిర్మాత సింగనమల రమేష్, భాను కిరణ్ తనను బెదిరించారంటూ ఫైనాన్షియర్ జయంతిరెడ్డి సీసీఎస్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు.ఇక వర్మ ఈ కేసులో ఏం సమాధానం చెపుతారో అన్న విషయం అంతటా ఉత్కంతట నెలకొని ఉంది.ఇక ఇప్పటికి ఈ హత్య కేసులో ఇరవై ఏడు మందిని విచారిస్తే అందులో ఏడుగురు సినిమావారే కావటం విశేషం.