Don't Miss!
- News AP Pre-Poll Survey: ఏపీ ఎన్నికల్లో జనం పల్స్ క్లియర్ ! ఎన్ని సీట్లో తెలుసా ? లేటెస్ట్ సర్వే..
- Sports ధోనీని ఒప్పించడం కష్టమే..ఆ ఫేక్ న్యూస్ నమ్మొద్దు- రోహిత్
- Lifestyle Marriage Day Wishes in Telugu : పెళ్లిరోజు శుభాకాంక్షల సందేశాలను ఇలా పంపండి..
- Finance Just Dial Stock: జస్ట్ డయల్ స్టాక్ రికార్డుల మోత.. ఇంట్రాడేలో 13 శాతం అప్.. అదే కారణం..
- Automobiles టోల్గేట్ల వద్ద ఇకపై ఈ బోర్డులు ఉండవు.. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
- Technology ధర రూ. 20 వేలలో, వైర్లెస్ ఛార్జింగ్ తో వచ్చే మొట్ట మొదటి ఫోన్! సేల్ ఈ రోజే! ఆఫర్ వివరాలు
సూరి హత్య కేసులో విచారణకు రామ్ గోపాల్ వర్మ
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ని ఈ రోజు (సోమవారం)..మద్దెల చెవురు సూరి హత్య కేసులో సీసీఎస్ పోలీసులు విచారించనున్నట్లు సమాచారం. రక్త చరిత్ర పార్ట్-2 చిత్రీకరణ నిమిత్తం సూరి పెట్టుబడులు పెట్టాడన్న కోణంలో ఈ ఎంక్వైరీ జరగనుంది. సూరికి వర్మకి మధ్య కో ఆర్డనేటర్ గా భాను వ్యవహించాడని చెప్తున్నారు. ఇక భాను..రక్త చరిత్ర చిత్రం కు అవసరమైన లొకేషన్స్ ను చూపించడంలో సహాయపడ్డాడని ఇప్పటికే తెలుగువెర్షన్ నిర్మాత సి.కళ్యాణ్ పోలీసులకు తెలిపటం ఈ విచారణకు అవకాశమిచ్చింది. ఇదిలా ఉండగా మద్దెలచెరువు సూరి హత్యకేసులో ప్రధాన నిందితుడు భానుకిరణ్పై సీసీఎస్లో మరో కేసు నమోదు అయ్యింది. సినీ నిర్మాత సింగనమల రమేష్, భాను కిరణ్ తనను బెదిరించారంటూ ఫైనాన్షియర్ జయంతిరెడ్డి సీసీఎస్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు.ఇక వర్మ ఈ కేసులో ఏం సమాధానం చెపుతారో అన్న విషయం అంతటా ఉత్కంతట నెలకొని ఉంది.ఇక ఇప్పటికి ఈ హత్య కేసులో ఇరవై ఏడు మందిని విచారిస్తే అందులో ఏడుగురు సినిమావారే కావటం విశేషం.