twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘దేనికైనా రెడీ’ సినిమాపై మరో వివాదం

    By Srikanya
    |

    వరంగల్: 'దేనికైనా రెడీ' సినిమాపై వివాదాలు ఇప్పట్లో ముగిసేలా లేవు. ఈ సినిమాలోని దృశ్యాలు హిందువుల మనోభావాలను కించపరుస్తున్నాయని ఓ న్యాయవాది కోర్టుకెక్కాడు. ఈమేరకు జనగామ సివిల్ కోర్టులో పవన్ అనే న్యాయవాది దావా వేశారు. దీంతో చిత్ర నిర్మాత మోహన్‌బాబు, హీరో విష్ణు, బ్రహ్మానందం సహా తొమ్మిది మందిపై కేసు నమోదు చేయాలని న్యాయమూర్తి ఆదేశించారు.

    వివాదాస్పద చిత్రం దేనికైనా రెడీ చిత్రం మళ్లీ వార్తల్లోకెక్కింది. హిందువుల మనోభావాలను, బ్రాహ్మణ సమాజ ఆచార, వ్యవహారాలను కించపరిచేలా సినిమా ఉందంటూ జనగామకు చెందిన బ్రాహ్మ ణ సేవా సమాఖ్య సహాయ కార్యదర్శి వారణాసి పవన్ కుమార్‌శర్మ, స్థానిక ప్రిన్సిపల్ జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో మంగళవారం ప్రైవేటు పిటిషన్ దాఖలు చేశారు.చిత్రాన్ని నిషేధిస్తూ నిర్మాత మోహన్‌బాబు, నటుడు మంచు విష్ణు సహా ఏడుగురిపై చీటింగ్ కేసు నమోదు చేయాలని కోరారు.

    సినిమాలో రెండు మతాల క్యారెక్టర్లతో చండీయాగం జరిపించడం, బ్రాహ్మణుల భార్యలను తక్కువ చేస్తూ డైలాగులు చెప్ప డం వంటి అంశాలపై 420, 295ఏ, 29 153 ఏ ఆర్/డబ్ల్యూ, 120బీ ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. స్పం దించిన జడ్జి, ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి విచారణ జరిపి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని జనగామ ఠాణా ఎస్‌హెచ్‌వోను ఆదేశించారు.

    English summary
    On a petition filed against the producer and some actors of the film 'Denikaina Ready' a court in Jangaon, in Warangal District directed the police to register a case against the film producer, director and actors of the film. The Jangaon police registered cases under different sections of the IPC against the film producer Mohan Babu, lead actor Vishnu, director Nageshwar Reddy, comedian Brahmanandam and Dhanalakshmi on court orders.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X