Don't Miss!
- News ఈ ఒక్కటి ఇంట్లో ఉంటే డబ్బు ఆటోమేటిక్ గా వస్తుంది
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
తప్పిపోయిన డైరీ దొరికింది...ఊపిరి పీల్చుకున్నారు
ముంబై: తన నిర్లక్ష్యపు డ్రైవింగ్ ద్వారా 2002లో ఫుట్ఫాత్ పై నిద్రిస్తున్న వారిపై నుంచి కారు దూసుకెళ్లి ఒకరి మృతికి, నలుగురు గాయాలకు కారణమయ్యారంటూ సల్మాన్ఖాన్ పై నమోదైన కేసుకు సంబంధించిన వివరాల డైరీ దొరకడంతో ముంబయి పోలీసులు వూపిరి పీల్చుకున్నారు. కేసుకు సంబంధించిన డైరీ మంగళవారం బాంద్రా పోలీసు స్టేషన్లో కనుగొన్నట్లు ముంబయి పోలీసు కమిషనర్ రాకేష్ మారియా బుధవారం తెలిపారు.
పోలీసుస్టేషన్ మరమ్మతులో భాగంగా దస్త్రాలను రికార్డుగది నుంచి వేరేచోటికి మార్చారని, ఆ తర్వాత దానిని గుర్తించలేక పోయారన్నారు. కృష్ణ జింకను వేటాడిన కేసు దోష నిర్ధరణలో రాజస్థాన్ హైకోర్టు ఆదేశాలను సమర్థిస్తూ .. తనను న్యాయస్థానాలు ఎల్లపుడూ సాధారణ పౌరుడి మాదిరిగానే చూస్తూ ఎలాంటి ప్రత్యేక సౌకర్యాలు కల్పించలేదని బాలీవుడ్ సూపర్స్టార్ సల్మాన్ఖాన్ సుప్రీంకోర్టుకు తెలిపారు.
2002 సెప్టెంబర్ 28న ముంబయిలో సల్మాన్ కారు.. ఒక బేకరీ బయట రోడ్డు పక్కన నిద్రిస్తున్న జనంపై నుంచి వెళ్లింది. ఈ ఘటనలో ఒకరు మరణించగా, నలుగురు గాయపడ్డారు. ఈ కేసుకు సంబంధించి 63 మంది సాక్షుల వాంగ్మూలాల్లో ఏడు మాత్రమే అసలు పత్రాలు ఉన్నాయని, మిగతావి నకలు పత్రాలు ఉన్నాయని పోలీసులు లోగడ న్యాయస్థానానికి తెలియజేశారు.