Don't Miss!
- Finance Banking News: ప్రభుత్వ బ్యాంకులకు ఆ అధికారం లేదు.. బాంబే హైకోర్టు సంచలన తీర్పు..
- Automobiles వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
- News ఆ ఘటన కలచివేసింది: వైసీపీ సోషల్ మీడియా భేటీలో జగన్: విశాఖ కేంద్రంగా
- Sports IPL: నైట్ అంతా సిట్టింగ్ వేస్తే ఎలా గెలుస్తారు?- రైనా
- Technology అద్భుతమైన డిజైన్ తో నోకియా కొత్త ఫోన్ Nokia N90 Flip ! వివరాలు
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
రామ్ చరణ్, కృష్ణ వంశీ మూవీ లేటెస్ట్ అప్డేట్స్
హైదరాబాద్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, కాజల్ జంటగా క్రియేటివ్ దర్శకుడు కృష్ణ వంశీ డైరెక్షన్లో....శివబాబు బండ్ల సమర్పణలో, పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై అత్యంత భారీ తారాగణంతో నిర్మిస్తున్న చిత్రం యూనిట్ కన్యాకుమారి షెడ్యూల్ని పూర్తి చేసుకుని మార్చి 9 నుండి పొల్లాచ్చి వెళ్ల నుంది. ఈ షెడ్యూల్లో కొన్ని సన్నివేశాలతో పాటు ఓ సాంగ్ చిత్రీకరణ చేయనున్నారు.
ఈ సందర్భంగా నిర్మాత బండ్ల గణేష్ మాట్లాడుతూ...'ఫిబ్రవరి 6న రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించిన మా చిత్రం కన్యాకుమారిలోని లొకేషన్స్లో సన్నివేశాల చిత్రీకరణ చేసాము. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, శ్రీకాంత్లపై చిత్రీకరించిన సన్నివేశాలు ఎంతో బాగా వచ్చాయి అన్నారు.
సినిమా యూనిట్ సభ్యులంతా ఎంతో ఎంజాయ్ చేస్తూ నటిస్తున్నారు. మార్చి 9 నుండి 26 వరకు పొల్లాచ్చి లో కొన్ని సీన్లతో పాటు సాంగ్ చిత్రీకరణ చేస్తాము. సినిమాకు పని చేసే నటీనటులు, టెక్నీషియన్స్ అంతా బాగా పని చేస్తున్నారు. అందరి అంచనాలను అందుకునేలా సినిమా ఉంటుంది అన్నారు.
రామ్ చరణ్కు జోడీగా కాజల్ నటిస్తుండగా, శ్రీకాంత్కి జోడీగా కమలిని ముఖర్జీ నటిస్తున్నారు. చక్కటి ఫ్యామిలీ ఎంటర్టెనర్గా తెలుగు సంప్రదాయాలు ఉట్టిపడేలా దర్శకుడు కృష్ణ వంశీ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. సమీర్ రెడ్డి సినిమాటోగ్రాఫర్గా పని చేస్తున్నాడు అని నిర్మాత గణేష్ తెలిపారు.