Don't Miss!
- News ఎన్నికల ప్రచారానికి నేటితో తెర: ఈ రాష్ట్రాల్లో ఎల్లుండి పోలింగ్
- Sports ఆ రూల్ వల్లే గెలిచాం- KL రాహుల్
- Automobiles క్రాష్ టెస్ట్లో హోండా అమేజ్కు గట్టి షాక్.. ఆ విభాగంలో ‘0' రేటింగ్.!!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
కాపీ కొట్టారా లేదా ...హై కోర్టులో ఈ రోజే
బెంగళూరు : కన్నడ సినిమా అభినేత్రి వివాదంలో చిక్కుకుంది. ఓ రచయిత్రి కోర్టు మెట్లు ఎక్కడంతో విడుదలకు నోచుకోలేదు. ప్రముఖ సినీతార పూజాగాంధీ నటించి, స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. సినిమా రీళ్లు, స్క్రిప్ట్ స్వాధీనం చేసుకోవాలంటూ సిటీసివిల్ కోర్టు ఆదేశాలు ఇవ్వడంతో పూజాగాంధీ హైకోర్టులో అర్జీ దాఖలు చేశారు. అర్జీని స్వీకరించిన ధర్మాసనం తదుపరి విచారణను నేడు (గురువారం) నిర్వహించనుంది.
తాను ఎవరి నవలను కాపీ కొట్టి అభినేత్రి సినిమాను నిర్మించలేదని, నటి కల్పన జీవితచరిత్రకు తన చిత్రానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టీకరించినా దిగువ కోర్టు తన వాదనల్ని పరిగణలోకి తీసుకోలేదని అర్జీలో పేర్కొన్నారు. భాగ్య కృష్ణమూర్తి అనే రచయిత్రి వేసుకున్న అర్జీ, ఫిర్యాదుల ఆధారంగా సినిమా విడుదలపై సిటీసివిల్ కోర్టు మంగళవారం స్టే విధించింది. ఈనేపథ్యంలో పూజాగాంధీ హైకోర్టుకు విన్నవించారు.
దివంగత నటి కల్పన జీవిత చరిత్రనే అభినేత్రి చిత్రంగా తెరకెక్కించారంటూ భాగ్య కృష్ణమూర్తి, పరిశ్రమకు చెందిన ప్రముఖులు కొందరు కోర్టులో అర్జీ వేసుకున్నారు. తాను రచించిన అభినేత్రి నవలనే కాపీ కొట్టి ఈ చిత్రం నిర్మించారనేది భాగ్య కృష్ణమూర్తి ప్రధాన ఆరోపణ.
తాను నిర్మాతగా ఉంటూ నాయికగా నటిస్తున్న అభినేత్రి చిత్రానికి, దివంగత నటి కల్పన జీవితానికి ఎటువంటి సంబంధం లేదని నటి పూజాగాంధీ కోర్టులో వివరణ ఇచ్చారు. కల్పన జీవితాన్ని పూజా చిత్రంగా తీస్తున్నారని, ఈ చిత్రం విడుదల కాకుండా ఆదేశించాలంటూ కల్పన బంధువులు కొందరు ఒకటవ ఏసీఎంఎం కోర్టులో దావా వేశారు. దీనిపై వివరణ ఇవ్వాలంటూ ఏసీఎంఎం కోర్టు ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా పూజా కోర్టుకు హాజరయ్యారు. కల్పన జీవితాన్ని తాను చిత్రంగా తీయటం లేదని న్యాయమూర్తి ముందు ఆమె వివరణ ఇచ్చారు.
వెండితెరపై ఒక్కవెలుగు వెలిగి పరిస్థితుల ప్రభావంతో దుర్భర జీవితం సాగించిన హీరోయిన్స్ జీవితాల కథాంశంతో 'అభినేత్రి' సినిమా రూపొందుతోంది. ఈ సినిమా ద్వారా ప్రముఖ నటి పూజాగాంధీ నిర్మాతగా మారడంతో పాటు ప్రధాన పాత్రను కూడా పోషిస్తోంది. కట్టుబొట్టు అలనాటి నటి కల్పనను పోలిఉన్నా ఆమె జీవితానికి అభినేత్రి సినిమాకు సంబంధం లేదని పూజా స్పష్టం చేశారు.
ఏడో దశకం నాటి పరిస్థితుల నేపథ్యంలో కథాగమనం ఉంటుంది. అప్పటి పరిస్థితులకు అనుగుణంగా చిత్రీకరణను కొనసాగించేందుకు అనేక ఇబ్బందుల్ని ఎదుర్కొనాల్సి వచ్చిందని తెలిపారు. రంగస్థలం నేపథ్యం కోసం ఉత్తర కర్ణాటక ప్రాంతంలో చిత్రీకరణను పూర్తి చేశారు. అభినేత్రిలో అభినయం సవాల్గా తీసుకుని పూర్తిచేసినట్లు వెల్లడించారు. ఇప్పటికే టాకీ పార్ట్ పూర్తయింది. ఆడియోకు మంచి ఆదరణ లభిస్తోంది.