Don't Miss!
- News ముస్లింలోను ఓబీసీ జాబితాలో చేర్చిన ప్రభుత్వం
- Sports T20 World Cup: ఆ కుర్రాడికి టికెట్ కన్ఫార్మ్- సెహ్వాగ్
- Finance Railway News: రైలు ప్రయాణికులకు శుభవార్త..! టికెట్ క్యాన్సిలేషన్ ఛార్జీలు తగ్గింపు..
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
- Travel ఏపీలోని రైలు ప్రయాణికులకు శుభవార్త..వేసవి ప్రత్యేక రైళ్లు ఆగే స్టేషన్లివే..!
- Technology మే 7 న Apple 'Let Loose' ఈవెంట్! ఏ యే గాడ్జెట్లు లాంచ్ కాబోతున్నాయి? వివరాలు
- Automobiles 'కావ్య మారన్' ఖరీదైన కార్లు ఇవే! ఇక్కడ చూడండి
రకుల్ ప్రీత్ పీఠానికి పూజా హెగ్డే ఎసరు.. జోరు మీదున్న బికినీ భామ
దువ్వాడ జగన్నాథం ముందు వరకు యువ హీరోయిన్లలో అందాల తార రకుల్ ప్రీత్ సింగ్దే హవా. అగ్ర హీరోయిన్లతోనూ జతకట్టింది. రకుల్ నటించిన చిత్రాలన్నీ సక్సెస్ బాట పట్టాయి. ప్రస్తుతం చేతి నిండా సినిమాలు ఉన్నాయి. హి
దువ్వాడ జగన్నాథం ముందు వరకు యువ హీరోయిన్లలో అందాల తార రకుల్ ప్రీత్ సింగ్దే హవా. అగ్ర హీరోయిన్లతోనూ జతకట్టింది. రకుల్ నటించిన చిత్రాలన్నీ సక్సెస్ బాట పట్టాయి. ప్రస్తుతం చేతి నిండా సినిమాలు ఉన్నాయి. హిందీలో ఓ సినిమా చేస్తున్నది. దాంతో ఇటీవల పవన్ కల్యాణ్, మహేశ్ బాబు సినిమాలను రిజెక్ట్ చేసింది. అయితే దువ్వాడ జగన్నాథం హిట్ తర్వాత టాలీవుడ్కు హాట్ హాట్ ఫిగర్ రూపంలో పూజా హెగ్గే దొరికింది. ఇప్పుడు టాలీవుడ్ సినీ వర్గాల చూపంతా పూజా హెగ్డేపైనే పడింది.
దువ్వాడ జగన్నాథం చిత్రంలో పూజా హెగ్డే ఆరబోసిన అందాలకు యూత్ ఫిదా అయిపోయారు. బికినీ సీన్లో బోల్డ్గా నటించడం సినీ వర్గాల్లో చర్చనీంశమైంది. పాటలు, డ్యాన్సుల్లోనూ ఆకట్టుకొన్నది. అగ్రహీరోలతో జతకట్టే అంశాలన్నీ ప్రస్తుతం పూజా హెగ్డేలో కనిపిస్తున్నాయి. దాంతో రకుల్ పీఠానికి పూజా హెగ్గే ఎసరు పెట్టే అవకాశాలున్నాయనే మాట వినిపిస్తున్నది. మహేశ్ బాబు 25వ చిత్రంలో హీరోయిన్గా పూజా హెగ్డే కన్ఫర్మ్ అయిందనే మాట వినిపిస్తున్నది. కాగా స్పైడర్ చిత్రంలో మహేశ్ సరసన రకుల్ నటిస్తున్న సంగతి తెలిసిందే.