Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
అలా పడుకోవడం. 48 గంటలపాటు.. అదో చేదు అనుభవం.. పూజాహెగ్డే
బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చినప్పటికీ.. టాలీవుడ్లో అందాల భామ పూజా హెగ్డే దుమ్మురేపుతున్నది. వరుస చిత్రాలతో దూసుకెళ్తున్నది. నలుగురు అగ్రహీరోల చిత్రాలతో దడదడలాడిస్తున్నది. ఎన్టీఆర్తో అరవింద సమేతంగా.. అలాగే మహేష్ బాబు, రాంచరణ్, ప్రభాస్ చిత్రాల్లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే అరవింద సమేతంగా, మహేష్ బాబు చిత్రాలు పూర్తి కావొస్తున్నాయి. అయితే తనకు చేదు అనుభవాన్ని మిగిల్చిన తొలి చిత్రం మొహంజదారో గురించి పెద్దగా గుర్తుపెట్టుకోను అని వెల్లడించింది. ఇటీవల మీడియాతో మాట్లాడుతూ..
లైఫ్ను పరిపూర్ణంగా
నా జీవితాన్ని పరిపూర్ణంగా గడుపుతున్నాను. ఏ ఫిలిం ఇండస్ట్రీ అయినా నాకు ఒక్కటే. సినిమాల్లో క్యారెక్టర్లు మాత్రమే మారుతుంటాయి. టాలీవుడ్ చిత్రాల్లో నటించేటప్పుడు తెలుగు అమ్మాయిలా కనిపించేందుకు ప్రయత్నిస్తాను. భూమ్మీద మనుషులంతా ఒక్కటే. ప్రాంతాలను బట్టి వారి హావభావాలు మారుతుంటాయి అని పూజా హెగ్డే వెల్లడించింది.
హృతిక్తో చేదు అనుభం
హృతిక్ రోషన్తో నటించిన మొహంజదారో చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఆ చిత్రం పూర్తయి విడుదల కావడానికి రెండేళ్లు పట్టింది. కానీ బాక్సాఫీస్ వద్ద దారుణమైన పరాజయాన్ని అందుకొన్నది. సినిమాల్లో నా ఎంట్రీపై దారుణంగా ప్రభావం చూపించింది. అదంతా గతం. దానిని గురించి ఆలోచించుకొంటూ ఉండలేను అని పూజా అన్నారు.
ఆ సినిమా తర్వాత రెండేళ్ల గ్యాప్
మొహంజదారో చిత్రం తర్వాత మరో చిత్రంలో నటించడానికి రెండేళ్లు గ్యాప్ వచ్చింది. అందుకు చిత్ర యూనిట్తో చేసుకొన్న ఒప్పందమే. ఇండస్ట్రీలో నాకు గాఢ్ఫాదర్ లేడు. కాబట్టి ఇలాంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది. రెండో సినిమా గురించి ఎవరైనా సరే జాగ్రత్త పడాల్సిందే అని పూజా హెగ్డే పేర్కొన్నది.
దేవుడి దయవల్ల బిజీగా
ఆరంభంలో సమస్యలు ఎదుర్కొన్నా.. దేవుడి దయవల్లే ఇప్పుడు మంచే జరిగింది. చేతిలో పలు రకాల ప్రాజెక్టులతో బిజీగా మారాను. ఒక్కోసారి 46 గంటలపాటు పనిచేయాల్సి వస్తున్నది. ఎక్కువగా నేను ఫ్లయిట్లలో ప్రయాణించేటప్పుడే ఎక్కువగా నిద్రపోతున్నాను అని చెప్పారు.
రకరకాల పాత్రలతో గందరగోళం
ప్రస్తుతం ఒకేసారి నాలుగైదు చిత్రాల్లో ఒకేసారి నటిస్తున్నాను. విభిన్న రకాలైన పాత్రలు పోషిస్తున్నందున అప్పుడు గందరగోళం నెలకొంటుంది. షూటింగ్కు వెళ్లే ముందు నా పాత్ర ఏంటో తెలుసుకొని దానికి తగినట్టు మారిపోతాను. ఒక్కో సినిమా ఒక్కో ప్రదేశంలో షూట్ చేస్తారు. కాబట్టి ఎక్కువగా ప్రయాణించాల్సి వస్తుంది. దాంతో జెట్ లాగ్కు గురవుతాను.