Don't Miss!
- News డబ్బు లేదా?: లోక్సభ ఎన్నికల్లో పోటీకి నిరాకరించిన నిర్మలా సీతారామన్
- Sports SRH vs MI: చేతులెత్తేసిన హార్దిక్ పాండ్యా.. కెప్టెన్సీ చేసిన రోహిత్ వీడియో
- Lifestyle చాణక్య నీతి ప్రకారం, ఈ తప్పులను నిర్లక్ష్యం చేసిన వారు జీవితంలో ఘోర వైఫల్యాన్ని ఎదుర్కొంటారు...!
- Automobiles కొత్త కాంపాక్ట్ ఎస్యూవీ బసాల్ట్ విజన్ ఎస్యూవీని ఆవిష్కరించిన సిట్రోయెన్
- Technology WhatsApp ద్వారా విదేశాలకు డబ్బు పంపేందుకు కొత్త ఫీచర్! వివరాలు
- Travel శివ కళ్యాణోత్సవాలకు ముస్తాబైన వేములవాడ రాజన్న ఆలయం!
- Finance Hyderabad: తల్లి కోరిక తీర్చిన ఆనంద్ మహీంద్రా.. 4000 మంది విద్యార్థుల కోసం హైదరాబాదులో..
అప్పుడు కంప్లైంట్ చేసింది.. ఇప్పుడు ఫెంటాస్టిక్ అంటోంది.. పూజా హెగ్డే వైరల్ ట్వీట్
తెలుగులో వరుస హిట్స్ ఖాతాలో వేసుకుంటూ స్టార్ హీరోయిన్గా ఎదిగింది పూజా హెగ్డే. ఇటీవలే గద్దలకొండ గణేష్ రూపంలో ప్రేక్షకులకు అలరించిన ఈ బ్యూటీ అల.. వైకుంఠపురములో సినిమాతో భారీ సక్సెస్ సాధించింది. ఇదిలా ఉంటే నిరంతరం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ఈ సుందరి ఓ మొబైల్ నెట్ వర్క్పై మండిపడటం, మళ్ళీ అదే నెట్ వర్క్ ఫెంటాస్టిక్ అనడం జరిగింది. ఇంతకీ పూజా ఈ మొబైల్ నెట్ వర్క్ జోలికి ఎందుకు వెళ్ళింది? వివరాల్లోకి పోతే..
చాలా చెత్తగా ఉంది.. పూజా ట్వీట్
ప్రముఖ ఎయిర్ టెల్ సంస్థపై కొద్దిరోజుల క్రితం హీరోయిన్ పూజా హేగ్దే తీవ్రంగా మండిపడింది. ఎయిర్టెల్ సర్వీస్ చాలా చెత్తగా ఉందని.. రాంగ్ బిల్లింగ్ చేస్తున్నారని, కస్టమర్ సర్వీస్ బాగోలేదని విమర్శిస్తూ ట్వీట్ చేసింది. ఈ మేరకు తాను ఎయిర్టెల్ సర్వీస్తో చాలా ఇబ్బందులు పడుతున్నానంటూ పేర్కొంటూ ఫైర్ అయింది. పైగా ఈ ట్వీట్ని ఎయిర్టెల్ సంస్థకు ట్యాగ్ చేసింది.
పూజా ఎదుర్కొన్న సమస్య.. పరిష్కారం
అయితే పూజా ట్వీట్ చూసిన ఎయిర్టెల్ నిర్వాహకులు స్పందిస్తూ ఆమెను క్షమాపణలు కోరారు. పూజా ఎదుర్కొన్న సమస్యను సరిచేసి ఆమెకు రిప్లై ఇచ్చారు. ఈ మేరకు ఎయిర్టెల్ ఇచ్చిన సర్వీస్పై మరోసారి పూజా హెగ్డే స్పందించింది.
ఫెంటాస్టిక్.. ఇప్పుడు ఓకే
చివరకు నేను ఫేస్ చేసిన సమస్య పరిష్కారమైందని తెలుపుతూ ఎయిర్టెల్కు కృతజ్ఞతలు చెప్పింది పూజా. ఇప్పుడు ఎయిర్టెల్ సర్వీస్ ఫెంటాస్టిక్ అని తెలిపింది. ''నా ఫిర్యాదు మిగతా ఎయిర్టెల్ వినియోగదారులకు మెరుగైన సేవలు అందడానికి తోడ్పడిందని ఆశిస్తున్నాను'' అని పేర్కొంది పూజా. దీంతో ఆమె చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
|
ఇకపోతే పూజా హెగ్డే సినిమాలంటారా..
ప్రస్తుతం 'అల.. వైకుంఠపురములో' సక్సెస్ ఎంజాయ్ చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. తదుపరి ప్రాజెక్టులుగా రాబోతున్న ప్రభాస్- రాధాకృష్ణ సినిమాలో, అలాగే బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రంలో నటిస్తోంది పూజా హెగ్డే.