Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
పూజా హేగ్డేకు ఫిదా.. ఆ ముగ్గురు అలా పడిపోయారేంటబ్బా!
పూజా హెగ్డే టాలీవుడ్ కి వచ్చిన కొత్తల్లో అందాలని హద్దుల్లో ఉంచుకుని నటిస్తూ క్యూట్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ముకుంద, ఒకలైలా కోసం వంటి చిత్రాలు విజయం సాధించకున్నా పూజా హెగ్డే నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఆతరువాత బాలీవుడ్ లోకి ఎంటర్ అయ్యిన ఈ అమ్మడు తన పంథానే మార్చేసింది. అందాలకు ఆరబోతుకు హద్దులు లేవంటూ తేల్చేసింది. దాంతో ముగ్గురు అగ్రహీరోలు ఆమెకు దాసోహమంటున్నారు..
Recommended Video
టాలీవుడ్లో అదృష్టం కలిసి..
తొలుత టాలీవుడ్లో అదృష్టం కలిసి రాలేదు. చాలా కాలం తరువాత డీజే చిత్రంలో టాలీవుడ్ లోకి రీఎంట్రీ ఇచ్చింది. ఆ చిత్రంలో పూజా అందాలకు కుర్ర కారు ఫిదా అయ్యారు. యూత్ లో ఫాలోయింగ్ విపరీతంగా పెరిగిపోయింది. టాలీవుడ్ లో పూజకు ప్రస్తుతం ఉన్న డిమాండ్ చూస్తే షాక్ అవ్వాల్సిందే. ఏకంగా ముగ్గురు బడా హీరోలని బుట్టలో వేసేసుకుంది.
యంగ్ టైగర్ తో రొమాన్స్
ఎన్టీఆర్, త్రివిక్రమ్ ల కలయికలో ప్రతిష్టాత్మకంగా ఓ చిత్రం రూపొందుతోంది. మతాల మాంత్రికుడు త్రివిక్రమ్ తొలిసారి ఎన్టీఆర్ ని డైరెక్ట్ చేయబోతున్నాడు. అజ్ఞాతవాసి ఫలితం తేడా కొట్టడంతో ఈ సినిమా ప్లానింగ్ పకడ్బందీగా చేస్తున్నాడు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన నటించే అవకాశం పూజా హెగ్డే కు దక్కినట్లు వార్తలు వస్తున్నాయి.
బాహుబలి పక్కన కూడా
పూజా ఎక్కడో నక్కతోక తొక్కినట్లు ఉంది. ప్రభాస్ సరసన నటించే అవకాశం వచ్చిందంటే జాతీయ స్థాయిలో ప్రచారం దక్కినట్లే. బాహుబలి చిత్రం తరువాత ప్రభాస్ మార్కెట్, క్రేజ్ జాతీయ వ్యాప్తంగా పెరిగింది. ప్రస్తుతం ప్రభాస్ సాహో చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం పూర్తయ్యాక కృష్ణం రాజు నిర్మాణంలో జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ నటించనున్నాడు. ఈ చిత్రంలో హీరోయిన్ ఆ పూజాని సంప్రదిస్తునట్లు ఫిలిం సర్కిల్స్ లో న్యూస్.
సూపర్ స్టార్ తో అంటే మాటలా
సూపర్ స్టార్ మహేష్ బాబుతో స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఏ హీరోయిన్ కి ఉండదు. బాలీవుడ్ భామలు సైతం మహేష్ తో నటించే అవకాశం వస్తే వదులుకోవాలని అనుకోరు. అలాంటి లక్కీ ఛాన్స్ పూజా హెగ్డే వద్దకు వెళ్ళింది. మహేష్ తన 25 వ చిత్రాన్ని వంశి పైడిపల్లి దర్శకత్వంలో నటించనున్నాడు. భరత్ అనే నేను తరువాత ఈ చిత్రం ప్రారంభం కానుంది. ఈ సినిమా కోసం పూజాని హీరోయిన్ గా సంప్రదిస్తునట్లు వార్తలు వస్తున్నాయి.
మూడు క్రేజీ ప్రాజెక్ట్స్ ఒకేసారి
ఒకేసారి ముగ్గురు స్టార్ హీరోల చిత్రాల్లో నటించే అవకాశం ఈ మధ్య కాలంలో మరే హీరోయిన్ కి దక్కలేదంటే అతిశయోక్తి కాదు. ఎన్టీఆర్ చిత్రం త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. ఇక ప్రభాస్, మహేష్ సినిమాలు ఈ ఏడాది ద్వితీయార్థంలో సెట్స్ పైకి వెళ్లనున్నాయి.