Don't Miss!
- News తెలంగాణ జెన్కో, ఏఈ, కెమిస్ట్ ఉద్యోగ పరీక్ష వాయిదా
- Sports Tilak Varma:అతని కోసమే ఆ సంబరాలు! వీడియో
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Technology 6.67 అంగుళాల డిస్ప్లే, ట్రిపుల్ కెమెరాతో వివో కొత్త ఫోన్... లాంచ్, స్పెసిఫికేషన్ల వివరాలు..!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
ఒట్టేసి చెబుతున్నా.. పూజా హెగ్డే పోస్ట్.. సెంటరాఫ్ అట్రాక్షన్గా టబు
అల వైకుంఠపురములో చిత్రం ఇప్పటికే ఎన్ని సంచలనాలు నమోదు చేస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే సోషల్ మీడియాలో కొత్త కొత్త రికార్డులను క్రియేట్ చేస్తూ సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారుతోంది. స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్దమైన వీరు సంక్రాంతి బరిలోకి దిగేందుకు సిద్దమయ్యారు. తాజాగా ఈ మూవీ గురించి పూజా హెగ్డే చేసిన ట్వీట్, షేర్ చేసిన పోస్ట్ తెగ వైరల్ అవుతోంది.
మిలియన్ లైక్స్తో రికార్డు..
ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న 'సామజవరగమన' సాంగ్ పలు రికార్డులకు బ్రేక్ చేస్తూ దూసుకుపోతోంది. తాజాగా ఈ సాంగ్ ఓ సెన్సేషనల్ ఫీట్ అధిగమించింది. సోషల్ మీడియాలో 1 మిలియన్ లైక్స్ పొందిన తొలి వీడియోగా రికార్డు నమోదు చేసింది. తెలుగు చిత్రసీమలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఫీట్ సాధించింది 'సామజవరగమన' సాంగ్.
|
సిద్ శ్రీరామ్ గాత్రం.. సిరివెన్నెల సాహిత్యం..
'సామజవరగమన' అంటూ సాగే ఈ మెలోడీ పాటను సిద్ శ్రీరామ్ ఆలపించగా తమన్ సంగీతం అందించారు. సీతారామ శాస్త్రి అందించిన లిరిక్స్ పాటకు ప్రాణం పోశాయి. తెలుగు ప్రేక్షకులను, మరీ ముఖ్యంగా మెగా అభిమానులను ఎంతగానో అలరించింది ఈ సాంగ్. ఈ చిత్రం ఇప్పటికీ అప్రతిహతంగా దూసుకుపోతూనే ఉంది.
|
ఆనందంలో పూజా
ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే నటిస్తోన్న సంగతి తెలిసిందే. సామజవరగమన ఇంతటి రికార్డులను సృష్టించిన నేపథ్యంలో ఉబ్బితబ్బిబ్బైన పూజా.. సోషల్ మీడియాలో స్పందించింది. ఒట్టేసి చెబుతున్నా.. ఈ పాట విజువల్స్ మీ అందరికీ నచ్చుతాయని ట్వీట్ చేసింది.
Recommended Video
వైరలవుతోన్న టబు..
అంతేకాకుండా చిత్ర యూనిట్తో దిగిన ఫోటోను పూజా హెగ్డే షేర్ చేసింది. ఈ పిక్లో సుశాంత్, నివేదా పేతురాజ్ మిస్ అయ్యారని తెలిపింది. ఈ పిక్లో అందరికంటే ఎక్కువగా మెరిసిపోతూ.. సెంటరాఫ్ అట్రాక్షన్గా వెలిగిపోతోంది టబు. అందరి దృష్టి ఆమెపైనే ఉండటం విశేషం.