Don't Miss!
- News ఎల్లుండే వైసీపీలోకి యనమల ? చర్చలు పూర్తి..!
- Finance Stock Market: ప్లాట్ గా స్టాక్ మార్కెట్లు.. టెక్ మహీంద్రాలో భారీ కుదుపు..!
- Lifestyle ప్రపంచంలోనే అత్యంత పోషకమైన వేచూర్ ఆవు పాలు: గిన్నీస్ రికార్డ్ సాధించిన ఈ ఆవు గురించి ఆసక్తికరమైన విషయాలు
- Sports RCBకి గుడ్ న్యూస్: ప్లే ఆఫ్స్కు ఇలా ఈజీగా చేరొచ్చు!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఎన్టీఆర్ మాటలు నాకు అర్థం కాలేదు, కానీ.. డుమ్మా కొట్టింది అందుకే!
Recommended Video
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ మంగళవారం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో తొలిసారి వస్తున్న చిత్రం ఇది. ఈ చిత్రంపై అభిమానులు తారాస్థాయిలో అంచనాలు పెట్టుకుని ఉన్నారు. ట్రైలర్ అద్భుతంగా ఉండడంతో త్రివిక్రమ్, ఎన్టీఆర్ గట్టిగా కొట్టబోతున్నారని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉండగా ప్రీరిలీజ్ ఈవెంట్ లో ఎన్టీఆర్ ప్రసంగం ఆసక్తికరంగా నిలిచింది. ఎన్టీఆర్ స్పీచ్ పై హీరోయిన్ పూజ హెగ్డే సోషల్ మీడియా వేదికగా స్పందించింది.
ఎందుకు రాలేదని అడుగుతున్నారు
ట్రైలర్ లో చూపిన విధంగా పూజ హెగ్డే, ఎన్టీఆర్ మధ్య రొమాంటిక్ సన్నివేశాలు ఆకట్టుకునే విధంగా ఉండబోతున్నాయి. భారీ స్థాయిలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కు పూజ హెగ్డే హాజరు కాలేదు. ఈ విషయంలో పూజ హెగ్డేకు ప్రశ్నలు ఎదురవుతున్న తరుణంలో ఈ అమ్మడు స్పందించింది. ఈవెంట్ కు ఎందుకు హాజరు కాలేదో వివరించింది.
బిజీ షెడ్యూల్
అరవింద సమేత ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరు కాకపోవడానికి కారణం బిజీ షెడ్యూల్ అని పూజ హెగ్డే తెలిపింది. ముందుగా కమిటైన కొన్ని చిత్రాల షూటింగ్ లో పాల్గొనవలసి వచ్చింది. జైసల్మేర్ లో షూటింగ్ జరుగుతోంది. అందువలనే అరవింద సమేత ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరు కాలేకపోయానని పూజ హెగ్డే వివరించింది.
|
ఎన్టీఆర్ మాటలు అర్థం కాలేదు
కానీ షూటింగ్ గ్యాప్ లో అరవింద సమేత ప్రీ రిలీజ్ ఈవెంట్ లైవ్ ఫాలో అవుతూనే ఉన్నా. షూటింగ్ ముగిసాక కూడా చూశా. ఎన్టీఆర్ ప్రసంగంలోని ప్రతి మాట గుండె లోతుల్లోనుంచి వచ్చినట్లుగా అనిపించిందని పూజ హెగ్డే తెలిపింది. ఎన్టీఆర్ మాట్లాడిన ప్రతి మాట నాకు అర్థం కాకపోవచ్చు. కానీ ఆ ఫీలింగ్ ని తాను కూడా అనుభవించానని పూజ హెగ్డే ట్వీట్ చేసింది.
ఫ్యాక్షన్ నేపథ్యంలో
త్రివిక్రమ్ ఈ చిత్రంతో కొత్త పంథాని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. రాయలసీమ ఫ్యాక్షన్ తో యాక్షన్ సీన్స్ హైలైట్ చేస్తూనే, చక్కటి సందేశాన్ని ఈ చిత్రం ద్వారా అదివ్వబోతున్నట్లు తెలుస్తోంది. పూజ హెగ్డే ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తుండగా, ఈషా రెబ్బ కీలక పాత్రలో నటిస్తోంది.