Don't Miss!
- News వల్లభనేని వంశీకి షాకిచ్చేలా యార్లగడ్డతో చంద్రబాబు వ్యూహం!!
- Sports భారత్.. టీ20 వరల్డ్ కప్ 2024 కొట్టాలంటే: లెజెండరీ ప్లేయర్ సలహా
- Finance Medicines News: కిరాణా కొట్టులో మందుల విక్రయం.. మోదీ సర్కార్ సంచలన నిర్ణయం..!!
- Lifestyle ప్రాణాలకు ముప్పు ఉందని తెలిపే హీట్ స్ట్రోక్ లక్షణాలు
- Technology Truecaller Spam Model స్పామ్ కాల్స్కు చెక్ పెట్టేందుకు ట్రూకాలర్ కొత్త టూల్ విడుదల..!
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
ధోనీపై పూజా హెగ్డే కామెంట్.. చురకలంటించిన నెటిజన్స్
Recommended Video
ప్రస్తుతం టాలీవుడ్లో వరుస సినిమాలతో మంచి జోష్లో ఉంది పూజా హెగ్డే. అరవింద సమేత, మహర్షి రూపంలో వరుస హిట్స్ ఖాతాలో వేసుకున్న ఈమె తాజాగా నెటిజన్స్ ట్రోలింగ్కి గురైంది. టీమ్ ఇండియా ఆటగాడు, మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీపై ఆమె చేసిన కామెంట్ పై విరుచుకు పడుతూ ట్రోల్స్ చేస్తున్నారు నెటిజన్లు.
సెమీ ఫైనల్లో భారత జట్టు
నిన్న (జులై 10) వ తేదీన జరిగిన వరల్డ్ కప్ సెమీ ఫైనల్లో భారత జట్టుపై న్యూజిలాండ్ జట్టు విజయం సాధించి ఫైనల్ చేరుకుంది. చివరిదాకా ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్ లో ధోని, రవీంద్ర జడేజా పార్ట్నర్షిప్ ఒక్కటే చెప్పుకోదగినది. టీమ్ ఇండియా జోష్ చూసి ఈ సారి వరల్డ్ కప్ భారత జట్టుదే అని ఫిక్స్ అయ్యారంతా. కానీ ఊహించని రీతిలో ఇండియా టీమ్ ఓడిపోవడాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు క్రీడాభిమానులు. సరిగ్గా ఈ తరుణంలో ధోనీపై కామెంట్ చేసి ఇరుక్కుపోయింది పూజా హెగ్డే.
|
ఇండియా ఓడిపోయాక పూజా హెగ్డే ట్వీట్
ఇండియా ఓడిపోయాక ట్వీట్ చేసిన పూజా.. ''భారత జట్టు పరాజయం పాలవడం తట్టుకోలేక పోతున్నా. బట్ ధోనీ బాగా ఆడాడు. మరోసారి ఈ మ్యాచ్ ద్వారా అతనే నా ఫేవరేట్ ఎందుకయ్యాడనేది ప్రూవ్ చేశాడు. ప్రతీ మ్యాచ్లో భారత విజయం కోసం పోరాడతారు ధోనీ. అతనంటే నాకు చాలా ఇష్టం'' అని పేర్కొంది. ఇదే ట్వీట్ నెటిజన్లకు ఆగ్రహం తెప్పించింది.
ధోనీ సాధించిన ఘనత ఏంటో!
నిజానికి భారత జట్టు 18 పరుగులతో ఓడిపోవడంతో పరోక్షంగా కారణమయ్యాడు ధోనీ. చివరిదాకా పోరాడిన ఆయన రన్ అవుట్ కాకపోయి ఉంటే భారత జట్టు గెలిచే అవకాశం ఉండేది. ఇవే అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ వరల్డ్ కప్లో ధోనీ సాధించిన ఘనత ఏంటో! ఎందుకంతగా పొడుగుతున్నావ్ పూజా అంటూ ఆమెకు చురకలంటిస్తున్నారు నెటిజన్లు.
పూజా హెగ్డే సినిమాలు
ప్రస్తుతం అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది పూజా హెగ్డే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అలాగే ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ దర్శకత్వంలో రాబోతున్న మరో సినిమాలో కూడా భాగమవుతోంది పూజా. ఇదిగాక బాలీవుడ్ మూవీ హౌస్ ఫుల్ 4 లో కూడా ఓ హీరోయిన్గా నటిస్తోంది.