Don't Miss!
- Sports సూపర్మ్యాన్ స్టబ్స్: మెరుపు ఫీల్డింగ్తో ఢిల్లీని గెలిపించాడు! Video
- News భట్టికి షాక్ - పంతం నెగ్గించుకున్న పొంగులేటి..!!
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
సన్నీ లియోన్ పరువుతీసిందంటూ...రూ. 100 కోట్ల దావా!
హైదరాబాద్: మాజీ పోర్న్ స్టార్, బాలీవుడ్ నటి సన్ని లియోన్ మీద మాజీ బిగ్ బాస్-5 కంటెస్టెంట్, మోడల్ పూజా మిశ్రా బాంబే హైకోర్టులో రూ. 100 కోట్లకు పరువు నష్టం దావా వేసింది. సన్నీ లియోన్ తన పరువు ప్రతిష్టలకు భంగం వాటిల్లే విధంగా ప్రవర్తించిందని, ఆమె మూలంగా తాను ఆర్థికంగా నష్టపోయాను...తనకు రూ. 100 కోట్లు చెల్లించాలని తన పిటీషన్లో డిమాండ్ చేసింది.
పూజా మిశ్రా పిటీషన్ స్వీకరించిన జస్టిస్ నరేష్ పాటిల్ నేతృత్వంలోని బాంబే హైకోర్టు డివిజన్ బెంచ్ ఈ పిటీషన్ పై విచారణను వేసవి సెలవుల తదుపరికి వాయిదా వేసింది. డివిజన్ బెంచ్ వాదనలు వినే సమయంలో పిటీషనర్ కోర్టుకు హాజరు కాలేదు.
పూజా మిశ్రా తన పిటీషన్లో.... బిగ్ బాస్-5లో మొదట తానే పాపులర్ పోటీదారునని, షో ప్రారంభమైన చాలా రోజులకు సన్నీ లియోన్ ఈ కార్యక్రమంలోకి ప్రవేశించిందని పేర్కొన్నారు. ఆ సమయంలో సన్నీ లియోన్ మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తూ తన పరువుకు నష్టం కలిగించే విధంగా మాట్లాడిందని పేర్కొన్నారు. తనకు దురుద్దేశాలు ఆపాదిస్తూ ఆరోపణలు చేసిందని తెలిపారు.
సన్నీ లియోన్ చర్య వల్ల తన గౌరవప్రతిష్టలకు తీవ్రమైన నష్టం వాటిల్లిందని, ఈ పరిణామాల క్రమంలో తన ఫిక్స్డ్ డిపాజిట్ష్, బ్యాంకు సేవింగ్స్ విత్డ్రా చేసుకోవాల్సి వచ్చిందని... ఈ కారణంగా తాను రూ. 70 లక్షల వరకు నష్టపోయాను అని పూజా మిశ్రా తన పిటీషన్లో పేర్కొన్నారు. సన్నీ లియోన్ మీద ఐపిసి సెక్షన్ 500(డిఫామేషన్), 120 బి(కుట్ర) అభియోగాలతో తగిన చర్యలు తీసుకోవాలని పూజా మిశ్రా తన పిటీషన్లో పేర్కొన్నారు.